చికోటి ప్రవీణ్ సహా భారతీయులకు బెయిల్ మంజూరు.. థాయ్‌లాండ్‌లో పోకర్ నిషేధమని తెలియదన్న ప్రవీణ్..!!

Published : May 02, 2023, 05:07 PM ISTUpdated : May 02, 2023, 05:30 PM IST
చికోటి ప్రవీణ్ సహా భారతీయులకు బెయిల్ మంజూరు.. థాయ్‌లాండ్‌లో పోకర్ నిషేధమని తెలియదన్న ప్రవీణ్..!!

సారాంశం

థాయ్‌లాండ్‌లో అరెస్ట్ అయిన క్యాసినో నిర్వహకుడు చికోటి ప్రవీణ్‌కు బెయిల్ మంజూరు అయింది. చికోటి  ప్రవీణ్‌తో సహా 83 మంది భారతీయులకు అక్కడి  న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

థాయ్‌లాండ్‌లో అరెస్ట్ అయిన క్యాసినో నిర్వహకుడు చికోటి ప్రవీణ్‌కు బెయిల్ మంజూరు అయింది. చికోటి  ప్రవీణ్‌తో సహా 83 మంది భారతీయులకు అక్కడి  న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. చికోటి  ప్రవీణ్‌కు బెయిల్ మంజూరు చేసిన సమయంలో కోర్టు షరతులు విధించింది. ఫైన్ చెల్లించే వరకు పాస్‌పోర్టులు అధికారుల వద్దే ఉంచాలని కోర్టు ఆదేశించింది. అయితే వారంతా ఫైన్ చెల్లించడంతో పోలీసులు పాస్‌పోర్టులను ఇచ్చేశారు. 

ఈ పరిణామాలపై స్పందించిన చికోటి ప్రవీణ్.. థాయ్‌లాండ్‌లో పోకర్ నిషేధమని తనకు తెలియదని చికోటి  ప్రవీణ్ తెలిపారు. తాను హాల్‌లో వెళ్లిన 10 నిమిషాలకే రైడ్ జరిగిందని చెప్పారు. తాను ఆర్గనైజర్‌ను కాదని.. తన పేరు ఎక్కడా లేదని చెప్పారు. దేవ్, సీతా తనకు ఆహ్వానం పంపారని చెప్పారు. నాలుగు రోజులు పోకర్ టోర్నమెంట్ ఉందని చెబితే వెళ్లానని తెలిపారు. పోకర్ టోర్నమెంట్ లీగల్ అని వారు తనకు చెప్పారని అన్నారు. 

ఇక, థాయ్‌లాండ్ పట్టాయాలోని ఓ విలాసవంతమైన హోటల్‌పై సోమవారం తెల్లవారుజామున అక్కడి పోలీసులు దాడి జరిపి పెద్ద మొత్తంలో గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్టుగా గుర్తించారు. మొత్తం 93 మందిని అరెస్ట్ చేయగా.. అందులో 83 మంది భారతీయులు ఉన్నారు. అరెస్టయిన వారిలో బీఆర్‌ఎస్ నేత, మెదక్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఉన్నారు. పోలీసులు అరెస్ట్  చేసిన వారిలో  ఏపీలోని  నెల్లూరు, గుడివాడకు  చెందిన  సుమారు  20 మంది  ఉన్నారని సమాచారం. 

ఏప్రిల్ 27-మే 1 వరకు హోటల్‌లో అనేక మంది భారతీయులు గదులు బుక్ చేసుకున్నారని.. జూదం కోసం సంపావో అనే సమావేశ గదిని అద్దెకు తీసుకున్నారని డిటెక్టివ్‌ల నుండి వచ్చిన సమాచారం మేరకు ఈ దాడి జరిగిందని అక్కడి  పోలీసులు వెల్లడించారు. పోలీసులు వచ్చి చూసేసరికి సంపావో గదిలో పెద్ద సంఖ్యలో జూదగాళ్లు బక్కరా, బ్లాక్‌జాక్‌లు ఆడుతూ కనిపించారని తెలిపారు. వారు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వెల్లడించారు.  83 మంది భారతీయులు, ఆరుగురు థాయ్‌లాండ్‌లు, నలుగురు మయన్మార్ జాతీయులను(మొత్తం 93 మందిని) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్  11 నుండి  16వ తేదీ వరకు కూడా చికోటి ప్రవీణ్  థాయ్‌లాండ్‌లో గ్యాబ్లింగ్ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం