హైదరాబాద్ కు జయరాం హత్యకేసు నిందితులు...

By Arun Kumar PFirst Published Feb 11, 2019, 8:58 PM IST
Highlights

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎక్స్‌ప్రెస్ టీవి అధినేత చిగురుపాటి జయరాం హత్య కేసు పలు మలుపులు తిరిగి హైదరాబాద్ పోలీసుల చెంతకు చేరింది. ఏపి పోలీసులు ఈ కేసు విచారణను కొద్దిరోజుల క్రితమే తెలంగాణ పోలీసులకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. కానీ వివిధ కారణాల వల్ల ఈ కేసులో ప్రధాన నిందితులను మాత్రం ఇప్పటివరకు అప్పంగించకపోవడంతో విచారణ ముందుకు సాగలేదు. అయితే తాజాగా ఈ హత్యకేసులో నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ లను తెలంగాణ పోలీసులు నందిగామ నుండి పిటి వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకువచ్చారు. 

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎక్స్‌ప్రెస్ టీవి అధినేత చిగురుపాటి జయరాం హత్య కేసు పలు మలుపులు తిరిగి హైదరాబాద్ పోలీసుల చెంతకు చేరింది. ఏపి పోలీసులు ఈ కేసు విచారణను కొద్దిరోజుల క్రితమే తెలంగాణ పోలీసులకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. కానీ వివిధ కారణాల వల్ల ఈ కేసులో ప్రధాన నిందితులను మాత్రం ఇప్పటివరకు అప్పంగించకపోవడంతో విచారణ ముందుకు సాగలేదు. అయితే తాజాగా ఈ హత్యకేసులో నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ లను తెలంగాణ పోలీసులు నందిగామ నుండి పిటి వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకువచ్చారు. 

హైదరాబాద్ కు చేరుకున్న వెంటనే ఈ నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు నేరుగా చింతలకుంటలోని ఓ న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి ఈ ఇద్దరు నిందితులకు ఈ నెల 25వ తేదీ వరకు జ్యూడిషియల్ కస్టడీ విధించినట్లు సమాచారం.  

తన భర్త జయరాంను మేనకోడలు శిఖా చౌదరి చంపించిందని మృతుడి భార్య పద్మశ్రీ అనుమానాలు వ్యక్తం చేస్తూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జయరాం హత్య కేసును జూబ్లీహిల్స్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏపి పోలీసులతో చర్చించారు. దీంతో ఈ హత్య కేసును నందిగామ నుండి హైదరాబాద్ జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. 

మరిన్ని వార్తలు

జయరాం హత్యకేసులో ట్విస్ట్ : తెలంగాణ పోలీసులకు నిందితులను అప్పగించమన్న జైలు సిబ్బంది..?

జయరాం హత్య కేసు: నందిగామకు జూబ్లీహిల్స్ పోలీసులు
 

click me!