గోషామహాల్ నుండి ట్రాన్స్‌జెండర్ చంద్రముఖి బరిలోకి

Published : Nov 18, 2018, 03:17 PM IST
గోషామహాల్ నుండి  ట్రాన్స్‌జెండర్  చంద్రముఖి బరిలోకి

సారాంశం

గోషామహాల్ నుండి  ట్రాన్స్‌జెండర్  చంద్రముఖి బరిలోకి


హైదరాబాద్:  గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని గోషామహాల్ అసెంబ్లీ స్థానం నుండి  బీఎల్ఎఫ్  ట్రాన్స్‌జెండర్ మువ్వల చంద్రముఖి ని బరిలోకి దింపింది.బీఎల్ఎఫ్  ఇప్పటికే  సుమారు 106 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. బీఎల్ఎఫ్ ప్రకటించిన జాబితాలో 52 మంది బీసీలకు టికెట్లు కేటాయించింది.

అయితే గ్రేటర్ హైద్రాబాద్‌ పరిధిలోని గోషామహాల్ అసెంబ్లీ స్థానం నుండి  చంద్రముఖిని బీఎల్ఎఫ్ బరిలోకి దింపుతోంది.  చంద్రముఖి ట్రాన్స్‌జెండర్. చంద్రముఖి ఉన్నత విద్యను అభ్యసించినట్టు బీఎల్ఎఫ్ ఛైర్మెన్  తమ్మినేని వీరభద్రం చెప్పారు.  అయితే  తమకు ఏ రాజకీయ పార్టీ కూడ టికెట్టు ఇవ్వలేదని చెప్పారు.

ప్రధాన పార్టీల నుండి పోటీ  చేసేందుకు చివరివరకు ప్రయత్నించిన అభ్యర్థులు  టికెట్లు దక్కకపోవడంతో చివరికి బీఎల్ఎఫ్ నుండి పోటీకి దిగుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu