తెలంగాణ గవర్నర్‌: సీ.పీ. రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం

By narsimha lodeFirst Published Mar 20, 2024, 11:39 AM IST
Highlights

తమిళిసై సౌందర రాజన్ రాజీనామాతో తెలంగాణకు జార్ఖండ్ గవర్నర్ సీ.పీ.రాధాకృష్ణన్ ను గవర్నర్ గా నియమించారు.  తెలంగాణ గవర్నర్ గా  సీ.పీ. రాధాకృష్ణన్  ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్‌గా  సీ.పీ. రాధాకృష్ణన్  బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ గవర్నర్ గా ఉన్న  తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు.  తమిళిసై సౌందరరాజన్  రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  ఆమోదించారు. దరిమిలా  జార్ఖండ్  గవర్నర్ సీ.పీ. రాధాకృష్ణన్ కు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు.  

also read:తిరుమల: లక్షితపై దాడి చేసిన చిరుత గుర్తింపు

మంగళవారంనాడు సాయంత్రమే  సీ.పీ. రాధాకృష్ణన్ హైద్రాబాద్ కు వచ్చారు.  బుధవారంనాడు  ఉదయం రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో  తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి   తెలంగాణ గవర్నర్ సీ.పీ. రాధాకృష్ణన్ తో ప్రమాణం చేయించారు.

తెలంగాణ గవర్నర్ సీ.పీ.రాధాకృష్ణన్  ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి  అనుముల రేవంత్ రెడ్డి,   పలువురు మంత్రులు, అధికారులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

also read:తొలిదశ లోక్‌సభ ఎన్నికలు: నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ

2019లో  తెలంగాణ గవర్నర్ గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్  రెండు రోజుల క్రితం  గవర్నర్ పదవికి రాజీనామా సమర్పించారు.  ఈ నెల  19న తమిళిసై సౌందరరాజన్  రాజీనామాను  రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము ఆమోదించారు. జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న సీ.పీ. రాధాకృష్ణన్ కు  తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్  బాధ్యతలను రాష్ట్రపతి అప్పగించారు. తెలంగాణ గవర్నర్ గా  ఇవాళ  ప్రమాణ స్వీకారం చేశారు.

also read:ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు: వీరికే ఛాన్స్?

తమిళనాడు రాష్ట్రం నుండి  లోక్ సభ ఎన్నికల్లో  పోటీ చేసేందుకు  తమిళిసై సౌందరరాజన్  గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్టుగా ప్రచారం సాగుతుంది.  2019 ఎన్నికల్లో తమిళనాడులోని తూత్తుకూడి ఎంపీ స్థానం నుండి  పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడ  తమిళిసై సౌందర రాజన్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.


 

click me!