పుష్ప - 2 ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు..

Published : May 31, 2023, 08:20 AM ISTUpdated : May 31, 2023, 08:25 AM IST
పుష్ప - 2 ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు..

సారాంశం

నార్కట్ పల్లి వద్ద జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. వీరు పుష్ప - 2 సినిమా షూటింగ్ కు వెళ్లి వస్తున్న ఆర్టిస్టులుగా తెలుస్తోంది. 

హైదరాబాద్ : హైదరాబాద్ - విజయవాడ శివార్లలో నార్కట్ పల్లి వద్ద బస్సును ట్రావెల్స్ బస్సు ఢీ కొంటింది. ఈ ట్రావెల్స్ బస్సులో పుష్ప - 2 సినిమా షూటింగ్ కు వెళ్లివస్తున్న ఆర్టిస్టులు ఉన్నారు. ఈ ప్రమాదంలో పలువురు ఆర్టిస్టులకు గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

నల్గొండ జిల్లాలో ఆగిఉన్న ఆర్టీసీ బస్సును నల్గొండనుంచి హైదరాబాద్ కు పుష్ప - 2 ఆర్టిస్టులతో వస్తున్న ట్రావెల్స్ బస్సు ఢీ కొంటింది. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఈ ప్రమాదం గురించి వెంటనే 100కు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ట్రాఫిక్ ను క్లియర్ చేసి తదుపరి చర్యలు చేపట్టారు. దీని గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu