ప్రభుత్వ సంక్షేమ‌ కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు ప్ర‌జ‌ల్లోకి వెళ్లండి : బీఆర్ఎస్ క్యాడర్ కు కేటీఆర్ పలుపు

Published : Aug 01, 2023, 02:57 PM IST
ప్రభుత్వ సంక్షేమ‌ కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు ప్ర‌జ‌ల్లోకి వెళ్లండి : బీఆర్ఎస్ క్యాడర్ కు కేటీఆర్ పలుపు

సారాంశం

Hyderabad: ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) బీఆర్ఎస్ క్యాడర్ కు ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ‌ కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు పార్టీ క్యాడర్ వ్యక్తిగతంగా, మీడియా ద్వారా ప్రజలతో మమేకమవ్వాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు.  

BRS working president and Minister KTR: తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రజా అనుకూల నిర్ణయాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వ్యక్తిగతంగా, మీడియా ద్వారా పార్టీ క్యాడర్ ప్రజలతో మమేకమై తెలంగాణ ప్రభుత్వ చర్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..  21 వేల మంది గ్రామ రెవెన్యూ సహాయకులను (వీఆర్ ఏ)లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అధికార యంత్రాంగంలోని మానవతా దృక్పథానికి నిదర్శనమన్నారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా చేర్చడం వంటి తాజా నిర్ణయం కూడా ఈ దిశగానే తీసుకున్నామ‌ని చెప్పారు. ఈ నిర్ణయాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ కార్మికులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్ డిపోల ముందు సంబరాలు నిర్వహించాలని టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ నేతలను కోరారు. వివిధ నియోజకవర్గాల్లోని వీఆర్ఏలు, ఆర్టీసీ కార్మికుల కుటుంబాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో అనాథల సమస్యను ప్రస్తావిస్తూ అనాథలందరినీ ఒకే విధానం కిందకు తీసుకురావడం, వారి శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వంపై పూర్తి బాధ్యతను ఉంచడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న కరుణామయ వైఖరిని కేటీఆర్ అభినందించారు.

రాష్ట్ర రాజధానిలో ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ మెట్రో రైలును 415 కిలోమీటర్లకు విస్తరించాలని నిర్ణయించినట్లు కేటీఆర్ వివరించారు. విస్తరణ తర్వాత మెట్రో రైలు అందుబాటులోకి వచ్చే నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ చర్య హైదరాబాద్ లో ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేస్తుందనీ, నగర విస్తరణకు సానుకూల ఫలితాలను ఇస్తుందని మంత్రి ఉద్ఘాటించారు. మెట్రో విస్తరణ పూర్తయితే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి కూడా వేగవంతమవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు తక్షణమే రూ.500 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అభినందించారు. ఈ సహాయం నిరుపేదలకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్