బీఆర్ఎస్ 95-105 సీట్లతో హ్యాట్రిక్ కొడుతుంది.. : ఎన్నిక‌ల్లో గెలుపుపై కేసీఆర్ ధీమా

Published : Oct 21, 2023, 01:35 AM IST
బీఆర్ఎస్ 95-105 సీట్లతో హ్యాట్రిక్ కొడుతుంది.. : ఎన్నిక‌ల్లో గెలుపుపై కేసీఆర్ ధీమా

సారాంశం

Telangana Assembly Elections 2023: రాష్ట్రంలో మెరుగైన పాల‌న అందిస్తున్నామ‌నీ, మ‌రోసారి భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్ రిజర్వాయర్ల నిర్మాణం, ప్రాజెక్టు నిర్వాసితులను గుర్తించామ‌ని చెప్పిన ఆయ‌న‌.. ఈ ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన వారి సమస్యలు తనకు తెలుసుననీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు చేసిన త్యాగాలకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు.   

BRS president and Chief Minister KCR: నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 95-105 సీట్లతో హ్యాట్రిక్ సాధిస్తామని బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జోస్యం చెప్పారు. శామీర్ పేటలోని ఒక ప్ర‌యివేటు ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో గజ్వేల్ కు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఇప్పటి వరకు ఎన్నో విజయాలు సాధించిందనీ, అయితే చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నారు. అంతులేని ప్రక్రియలో రాణించాలన్న తపన ఇప్పుడు రాష్ట్రం పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉందనీ, చరిత్రాత్మక మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ఏర్పాటుకు, దాని అభివృద్ధికి దారితీసిన కృషి కొనసాగుతుందని వివరించారు.

తన గజ్వేల్ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందనీ, అయితే ఇంకా చేయాల్సిన అవసరం ఉందన్నారు. చేసిన పనితో తృప్తి పడకుండా ఇంకా ఎక్కువ చేయాలన్నారు. గజ్వేల్ నుంచి గెలిస్తే సరిపోదనీ, గజ్వేల్ చుట్టుపక్కల మూడు, నాలుగు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్ర విద్యుత్, తాగునీటి సమస్యలను బీఆర్ఎస్ పరిష్కరించిందనీ, కొన్ని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పనులను పూర్తి చేస్తోందన్నారు. మౌళిక వసతుల కల్పనపై ఎక్కువ పని చేయాల్సి ఉందనీ, నిరాశ్రయులకు మరిన్ని ఇళ్లు నిర్మించాల్సి ఉందన్నారు. ఇవన్నీ, మరెన్నో చేయాలంటే బీఆర్ఎస్ మళ్లీ గెలవాలని అన్నారు. 

అప్పటి పాలకులు ఈ ప్రాంతాన్ని విస్మరించడంతో తెలంగాణ కోసం ఉద్యమం ప్రారంభించానని చెప్పారు. తెలంగాణకు సరిపడా కరెంటు రాదా, పరిశ్రమలు రాకూడదా, రైతులు ఇబ్బందులు పడాలా అని ముఖ్యమంత్రులను అడిగాన‌నీ, ఈ వైఖరిని ప్ర‌శ్నించ‌డం చేశాన‌నీ, ఈ నిర్లక్ష్యమే మన సొంత రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుని అభివృద్ధి చేసుకోవాల్సిన అనివార్యంగా మారిందన్నారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్ రిజర్వాయర్ల నిర్మాణం, ప్రాజెక్టు నిర్వాసితులను గుర్తించార‌ని చెప్పిన కేసీఆర్.. ఈ ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన వారి సమస్యలు తనకు తెలుసుననీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు చేసిన త్యాగాలకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. వచ్చే టర్మ్ లో నెలలో ఒకరోజు నియోజకవర్గంలో మకాం వేసి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానన్నారు.

అలాగే, "తాను కామారెడ్డి నుంచి పోటీ చేయడం వెనుక ఓ కారణం ఉంది. గజ్వేల్ ను వీడబోనని హామీ ఇస్తున్నాను. ఇక్కడి నుంచి మళ్లీ ఏ మెజారిటీతో నన్ను ఎన్నుకుంటారనేది మీ ఇష్టం. గజ్వేల్ ను రాష్ట్రానికి పట్టాభిషేక వైభవంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తనపై ఉందని" అన్నారు. గజ్వేల్ పార్టీ ఇన్ చార్జి మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. "మీ ఉత్సాహం కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉందనడానికి నిదర్శనమన్నారు. గజ్వేల్ లో జరిగిన అభివృద్ధిని రోల్ మోడల్ గా తీర్చిదిద్దామని, అభివృద్ధిని చూసేందుకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తున్నారని" చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Purandeswari Pays Tribute to NTR: ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన పురందేశ్వరి | Asianet News Telugu
NTR 30th Vardanthi: ఎన్టీఆర్ ఘన నివాళి అర్పించిన నందమూరి కళ్యాణ్ రామ్| Asianet News Telugu