ముగిసిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయం

By Siva KodatiFirst Published Jan 29, 2023, 5:35 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది . ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది.బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రసంగించాలని భేటీలో నిర్ణయించారు. రాష్ట్రాల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న అప్రజాస్వామిక తీరుపై పార్లమెంట్‌లో లేవనెత్తాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అలాగే తెలంగాణ పెండింగ్ హామీలపైనా పోరాడాలని బీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎల్లుండి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. 

click me!