టీఆర్ఎస్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు:స్వాగతించిన బండి సంజయ్

Published : Oct 18, 2022, 02:55 PM ISTUpdated : Oct 18, 2022, 03:17 PM IST
 టీఆర్ఎస్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు:స్వాగతించిన బండి సంజయ్

సారాంశం

కారు గుర్తును పోలిన గుర్తులను ఇండిపెండెంట్లకు కేటాయించవద్దని టీఆర్ఎస్  దాఖలు చేసిన పిటిషన్ ను  హైకోర్టు కొట్టివేయడాన్నిబండి సంజయ్   స్వాగతించారు.ఓటమి భయంతోనే టీఆర్ఎస్  తమపై  దుష్ప్రచారం చేస్తుందన్నారు.


నల్గొండ:కారు గుర్తును పోలిన గుర్తులను ఇండిపెండెంట్లకు కేటాయించవద్దని టీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడాన్నిబీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  స్వాగతించారు.

మంగళవారం నాడు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తూ నల్గొండలో ఆయన  మీడియాతో మాట్లాడారు.ఓటమి భయంతో  ఉపఎన్నికను నిలిపివేయాలని టీఆర్ఎస్ కుట్రలు పన్నుతుందన్నారు. మునుగోడులో  అభివృద్ది జరిగితే 16 మంది మంత్రులు ఎందుకు  ప్రచారం  చేస్తున్నారో చెప్పాలని బండి  సంజయ్  కోరారు. టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్  పామ్  హౌస్ కి వెళ్తారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే  బీజేపీ పోరాటం చేస్తుందని బండి సంజయ్  చెప్పారు.

మునుగొడులో బీజేపీ గెలుస్తుందని సర్వేలన్నీ చెబుతుండటం తో కేసీఆర్ కు జ్వరం పట్టుకుందని బండి  సంజయ్ సెటైర్లు వేశారు.ప్రజలకోసం నిజాయితీగా పనిచేసే నాయకులను మాత్రమే బీజేపీ లోకి ఆహ్వానిస్తున్నట్టుగా సంజయ్ చెప్పారు.ప్రజలకు, పార్టీకి పనికి రాని నాయకులను తీసుకుని తామేం  చేసుకుంటామన్నారు.

 ఒక్కో నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులు పెరిగారన్నారు.పార్టీలో అందరికీ సముచిత స్థానం ఉంటుందని బండి సంజయ్  హామీ ఇచ్చారు.పార్టీ నేతల  సేవలను ఉపయోగించుకుంటామన్నారు.తెలంగాణకు చేస్తున్న టీఆర్ఎస్ చేస్తున్న ద్రోహాన్ని తట్టుకోలేక బూర నర్సయ్య గౌడ్  బీజేపీలో  చేరారని ఆయన చెప్పారు.మోడీ నాయకత్వం లో మాత్రమే బడుగు బలహీన వర్గాలకు సేవ చేసే అవకాశం దక్కుతుందని బూర బీజేపీలో చేరినట్టుగా ఆయన తెలిపారు.

also  read:టీఆర్ఎస్‌కి తెలంగాణ హైకోర్టు షాక్: కారు గుర్తును పోలిన గుర్తులపై గులాబీ పార్టీ పిటిషన్ కొట్టివేత

మునుగోడు  ఉప ఎన్నికల్లో ఈ దఫా బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి బరిలోకి దిగారు .గత ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి  విజయం సాధించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu