
హైదరాబాద్: నెక్స్ట్ PCC చీఫ్ కేసీఆరేనని BJP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay విమర్శించారు. ట్విట్టర్ వేదికగా బండి సంజయ్ KCR పై మండిపడ్డారు.Pragathi Bhavan భవన్ నుండి కేసీఆర్ Gandhi Bhavan కు మారబోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. టెన్ జన్పథ్ నుండి కేసీఆర్ కు స్క్రిప్ట్స్ వస్తున్నాయన్నారు. ఈ స్క్రిప్ట్ మేరకే కేసీఆర్ మాట్లాడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. న్యాయ వ్యవస్థతో పాటు ప్రధాని, ఇతర వ్యవస్థలపై కేసీఆర్ కు నమ్మకం లేదన్నారు. Rafale scam విషయంలో సుప్రీంకోర్టు తీర్పును కేసీఆర్ ధిక్కరిస్తున్నారన్నారు. ఈ విషయమై నోరు జారితే రాఫెల్ రెక్కలకు కేసీఆర్ ను కడుతామని ఆయన మండి పడ్డారు.
ఆదివారం నాడు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. సర్టికల్ స్ట్రైక్స్ పై ఆధారాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై కేంద్ర మంత్రులు బీజేపీ నేతలు కేసీఆర్ పై ఎదురు దాడికి దిగుతున్నారు.ఇవాళ మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతుంటే చూస్తే గానీ కేసీఆర్ కు నమ్మకం కలగదేమో అని సంజయ్ సెటైర్లు వేశారు.తమపై దాడి జరిగిందని పాకిస్తాన్ కూడా ప్రకటించినా కేసీఆర్ నమ్మడా అని బండి సంజయ్ ప్రశ్నించారు. సర్జికల్ స్ట్రైక్స్ పై వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ ను క్షమించొద్దన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు సైనికుల ఆత్మ స్త్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.కేసీఆర్ వ్యాఖ్యలపై దేశ భక్తులంతా బాధపడుతున్నారన్నారు.
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి జరిగిందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి అక్రమాలు జరగలేదని Supreme Court తీర్పు ఇచ్చిందని బండి సంజయ్ గుర్తు చేశారు. Raffile యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి జరిగిందని విమర్శలు చేస్తే సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం పాల్జేయడమేనన్నారు.
సర్టికల్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత దేశమంతా సంబరాలు జరుపుకొందని ఆయన గుర్తు చేశారు. జవాన్ల త్యాగాన్లను కించపరిచేలా మాట్లాడడం దేశ ద్రోహమే అవుతుందని బండి సంజయ్ చెప్పారు సైనికులను నమ్మరు, ప్రధాని మాటల్ని నమ్మరు, పాక్ అధికారులు చెప్పినా కూడా నమ్మరా అని బండి సంజయ్ కేసీఆర్ ను ప్రశ్నించారు. సర్జికల్ స్ట్రైక్ జరగనే లేదని కేసీఆర్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. కేసీఆర్ ఏ దేశానికి మద్దతుగా మాట్లాడుతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు.
నిన్న కేసీఆర్ మాట్లాడిన మాటలన్నీ అవాస్తవాలేనని సంజయ్ తెలిపారు.. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మీడియా సమావేశం వీడియో క్లిప్పింగ్ ను బండి సంజయ్ విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. అంతేకాదు ఇదే విషయమై పాకిస్తాన్ అధికారులు చేసిన ప్రకటనకు సంబంధించిన వీడియోను సంజయ్ ఈ విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. దేశ భద్రత విషయంలో ఒక ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్చా అని బీజేపీ నేత ప్రశ్నించారు.
ఇటీవల కాలంలో కేసీఆర్ కు టెన్జన్పథ్ నుండి వచ్చిన స్క్రిప్టులతో మాట్లాడుతున్నారని కేసీఆర్ పై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. గతంలో Sonia Gandhiని పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని కేసీఆర్ అడిగితే ఆమె ఒప్పుకోలేదన్నారు. అయితే ఇక ప్రగతి భవన్ నుండి నెక్ట్స్ కేసీఆర్ గాంధీ భవన్ కే పోతాడని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
UPA ప్రభుత్వంలో కేసీఆర్ కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన పనితీరుపై స్వయంగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ క్షమాపణలు చెప్పిన విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు. గతంలో కేసీఆర్ ను సీబీఐ అధికారులు ఒక్క రోజు విచారించారన్నారు. ఈఎస్ఐ, సహారా కుంభకోణం విషయంలో CBI అధికారులు కేసీఆర్ ను ప్రశ్నించారని బండి సంజయ్ చెప్పారు. కేసీఆర్ అత్యంత అవినీతి పరుడని సంజయ్ విమర్శలు గుప్పించారు. గతంలో ప్రధాని Narendra Modiని Gajwel సభలో అభినందించారని బండి సంజయ్ గుర్తు చేశారు.