
ఉన్నత విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వర్సిటీ, ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజ్ల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేసింది. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కాలేజ్ల్లో బయోమెట్రిక్ అమలు చేయాలని తెలిపింది. విద్యార్థులతో పాటు టీచర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి బయో మెట్రిక్ హాజరు తప్పనిసరి అన పేర్కొంది.
అయితే స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేసేందుకు, వారి హాజరు శాతాన్ని తెలుసుకునేందుకు బయోమెట్రిక్ హాజరు ఉపయోగపడుతుందని ఉన్నత విద్యాశాఖ తెలిపింది.