కరీంనగర్‌లో ఎలుగుబంటి హల్‌చల్...పరుగులు పెట్టిన పేపర్ బాయ్స్

Published : Sep 20, 2018, 08:35 AM IST
కరీంనగర్‌లో ఎలుగుబంటి హల్‌చల్...పరుగులు పెట్టిన పేపర్ బాయ్స్

సారాంశం

అడవుల్లో ఉండాల్సిన ఎలుగుబంటి జనం మధ్యలోకి వచ్చి పరుగులు పెట్టించింది. కరీంనగర్‌లోని టవర్ సెంటర్‌లో తెల్లవారుజామున పేపర్లు సరిచూసుకుని డెలివరీకి వెళుతున్న పేపర్ బాయ్స్‌కి చీకటిలో నల్లటి ఆకారం కనిపించింది. 

అడవుల్లో ఉండాల్సిన ఎలుగుబంటి జనం మధ్యలోకి వచ్చి పరుగులు పెట్టించింది. కరీంనగర్‌లోని టవర్ సెంటర్‌లో తెల్లవారుజామున పేపర్లు సరిచూసుకుని డెలివరీకి వెళుతున్న పేపర్ బాయ్స్‌కి చీకటిలో నల్లటి ఆకారం కనిపించింది.

దగ్గరకి వెళ్లి చూడగా అది ఎలుగుబంటి.. క్రూర జంతువు కావడంతో వారు ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని.. ఎలుగుబంటిని బందించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu