నేడే RRR విడుదల..? బండి సంజయ్ చెప్పింది చెప్పినట్టుగానే..! దుబ్బాక తర్వాత మళ్లీ..

By team teluguFirst Published Nov 2, 2021, 12:28 PM IST
Highlights

హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఇప్పటికే బీజేపీ తరపున డబుల్ ఆర్ (రాజాసింగ్, రఘునందన్) లు ఉన్నారని.. త్వరలో మరో ఆర్ (రాజేందర్) అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారని చెప్పారు. 

దుబ్బాక ఉప ఎన్నిక బీజేపీలో కొత్త జోష్ నింపిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల సంద్భరంగా బీజేపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ అప్పటికే ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు‌లకు తోడుగా రఘునందన్‌రావు చేరడంతో సీఎం కేసీఆర్‌కు అసెంబ్లీలో ట్రిపుల్ ఆర్(RRR) సినిమా చూపిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే వాళ్లు చెప్పినట్టుగానే రఘునందన్‌రావు.. దుబ్బాకలో గెలవడంతో ట్రిపుల్ ఆర్‌గా స్లోగన్ నిజమైంది. ఆ తర్వాత రామచంద్రరావు.. ఎమ్మెల్సీ పదవి కాలం ముగియడం.. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోవడంతో.. అసెంబ్లీలో బీజేపీ RR(రాజా సింగ్, రఘునందన్‌రావు) కే పరిమితమైంది. 

Also read: Huzurabad Bypoll Result 2021: హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాల.. లైవ్ అప్‌డేట్స్.. 

ఆ తర్వాత జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సమయంలో బీజపీ అభ్యర్థి రవికుమార్ కావడంతో.. మరోసారి ట్రిపుల్ ఆర్ స్లోగన్ తెరపైకి వచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో రవికుమార్ ఓడిపోయారు. ఇక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ బరిలో నిలవడంతో మరోసారి ట్రిపుల్ ఆర్‌ గురించి విపరీతమైన చర్చ మొదలైంది. 

Also read: హుజురాబాద్‌‌లో టీఆర్‌ఎస్‌కు వరుస షాక్‌లు.. సీనియర్ నేతల ఇలాకాలో చేదు అనుభవం..

హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఇప్పటికే బీజేపీ తరపున డబుల్ ఆర్ (రాజాసింగ్, రఘునందన్) లు ఉన్నారని.. త్వరలో మరో ఆర్ (రాజేందర్) అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బీజేపీ ట్రిపుల్ ఆర్ సినిమా చూపించబోతోందని వ్యాఖ్యానించారు.  రాజేందర్ గెలిచిన తర్వాత అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్ కాంబినేషన్ ప్రజాగళం వినిపిస్తారని బండి సంజయ్ చెప్పారు.

Also read: టీఆర్‌ఎస్‌కు షాకిచ్చిన దళిత బంధు..! అక్కడ బీజేపీదే అధిక్యం.. కేసీఆర్ ప్లాన్ రివర్స్ కొట్టిందా..?

బండి సంజయ్ చెప్పినట్టుగానే ఆర్‌ఆర్‌ఆర్ కాంబినేషన్ కనిపించే సూచనలు కనిపిస్తున్నాయి. నేడు వెలువడుతున్న హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో ప్రతి రౌండ్‌లో అధిక్యం కనబరుస్తున్నారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన అన్ని రౌండ్లలో ఆధిక్యం ఈటలనే వరించగా తాజాగా ఆరో రౌండ్ లోనూ ఆయనే ఎక్కువ ఓట్లు సాధించారు.

Also read: హుజురాబాద్ లో కూడా దుబ్బాక రిపీట్..? మరోసారి రోటి మేకర్ గుర్తు తెరాస కొంపముంచనుందా..?

ఫలితాల ట్రెండ్స్‌పై స్పందించిన బండి సంజయ్.. హుజురాబాద్ లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం తాము ఊహించినదేనని చెప్పారు. హుజురాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగరుతుందని... ఈటల తిరిగి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారని బండి సంజయ్ అన్నారు. దీంతో బీజేపీ శ్రేణులు ఆనందంల మునిగిపోయారు. RRR ‌ను ఎదుర్కొవడానికి సీఎం కేసీఆర్ సిద్దంగా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు. 

click me!