హైదరాబాద్ లోనూ అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట ఉత్సవాలు.. ఎక్కడంటే ?

Published : Jan 21, 2024, 05:40 PM IST
హైదరాబాద్ లోనూ అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట ఉత్సవాలు..  ఎక్కడంటే ?

సారాంశం

అయోధ్యలోని రామాలయంలో ప్రాణ ప్రతిష్ట (ayodhya ram mandir pran pratishtha) కార్యక్రమం రేపు జరగబోతోంది. ఈ నేపథ్యంలో ప్రాణప్రతిష్ఠ వేడుకలు హైదరాబాద్ (pran pratishtha celebration in hyderabad)లోనూ నిర్వహించాలని కృష్ణ ధర్మ పరిషత్ (Krishna Dharma Parishad) సంకల్పించింది. దీని కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. 

అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబు అయ్యింది. రామాలయం ప్రాణ ప్రతిష్ట వేడుకకు సిద్ధం అయ్యింది. దేశంతో పాటు ప్రపంచంలోని హిందువులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ అపూర్వ ఘట్టానికి ఇంకా మరికొన్ని గంటలే సమయం ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో ఎక్కడ చూసినా రామ నామ స్మరణలే వినిపిస్తున్నాయి. అయోధ్య రామాలయమే కాకుండా దేశంలోని అన్ని ఆలయాలకు కొత్త కళ వచ్చింది. 

వావ్.. అంతరిక్షం నుంచి అయోధ్య ఆలయాన్ని ఫొటో తీసిన ఇస్రో శాటిలైట్.. ఎలా ఉందో చూశారా ?

అయోధ్యలో ఘనంగా రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న వేళ తెలంగాణలోని హైదరాబాద్ లోనూ ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ బాధ్యతలను కృష్ణ ధర్మపరిషత్ తన భుజాలపై వేసుకుంది. హిందువుల ఐక్యతను, రాముడిపై భక్తిని చాటేలా భాగ్యనగరంలో ఘనంగా ఈ వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమయ్యింది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధ్యక్షుడు అభిషేక్ గౌడ్ వెల్లడించారు.

షోయబ్ తో విడాకులు నిజమే.. కొత్త జంటకు విషెష్ చెప్పిన సానియా మీర్జా..

రేపు (జనవరి 22) హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఈ వేడుకకు బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ కే.లక్ష్మణ్ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు. మధ్యాహ్నం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం కోసం ఆ సంస్థ నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ చేశారు. ఇందులో శ్రీరాముడి పూజలు, హునుమాన్, గణేష్ కీర్తనలు భక్తిలహరి కార్యక్రమాలు ఉండన్నున్నాయి. 

అయోధ్యకు, ధనుష్కోడికి మధ్య సంబంధం ఏంటి ? ప్రధాని అక్కడ పూజలెందుకు చేశారు ? (ఫొటోలు)

దీంతో పాటు పలువురు డ్యాన్స్ ఆర్టిస్ట్ లోస్క్రీన్ పై శ్రీరామచరిత ప్రదర్శన కూడా కృష్ణ ధర్మపరిషత్ ఏర్పాటు చేయనుంది. అలాగే అయోధ్య ఆలయం గొప్పతనం, విశిష్టతను వివరించేలా రూపొందించిన డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే భక్తులను ఉద్దేశించి ఆ సంస్థ సభ్యుల ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉంటాయి. ఇందులో రాజ్యసభ సభ్యుడు కే.లక్ష్మణ్ కూడా ప్రసంగిస్తారు.

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Powerful Speech: కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు శ్రీకారం | Asianet Telugu
దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ! | Hyderabad Old City House Theft | Thief Sleeping In House