తెలంగాణ: రెండో రోజు పెరిగిన హాజరు శాతం.. ప్రైవేట్‌పై ప్రభుత్వ పాఠశాలలదే పైచేయి

Siva Kodati |  
Published : Sep 02, 2021, 05:20 PM IST
తెలంగాణ: రెండో రోజు పెరిగిన హాజరు శాతం.. ప్రైవేట్‌పై ప్రభుత్వ పాఠశాలలదే పైచేయి

సారాంశం

తెలంగాణలో రెండో రోజు ప్రత్యక్ష తరగతుల హాజరు శాతం పెరిగింది. మొదటి రోజుతో పోల్చుకుంటే రెండో రోజు స్కూళ్లకు హాజరైన విద్యార్ధుల సంఖ్య పెరిగింది. రెండో రోజు స్కూళ్లలో హాజరు శాతం 28.12 వున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. 

తెలంగాణలో రెండో రోజు ప్రత్యక్ష తరగతుల హాజరు శాతం పెరిగింది. మొదటి రోజుతో పోల్చుకుంటే రెండో రోజు స్కూళ్లకు హాజరైన విద్యార్ధుల సంఖ్య పెరిగింది. రెండో రోజు స్కూళ్లలో హాజరు శాతం 28.12 వున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. మొదటి రోజు 21.77 హాజరు నమోదైంది. ఇక ఇవాళ కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఎక్కువ హాజరు కనిపించింది. ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం.. 38.82 వుండగా.. ఎయిడెడ్ పాఠశాలల్లో ఇది 15.04గా వుంది. ఇక ప్రైవేట్ స్కూళ్లలో 21.74 శాతం హాజరు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తల్లిదండ్రుల్లో వున్న అపోహలను తొలగిస్తున్నారు టీచర్లు. 

PREV
click me!

Recommended Stories

Revanth Reddy Full Speech At Nakirekal Meeting | Asianet News Telugu
రాజగోపాల్ రెడ్డి పేరు ఎత్తగానే దద్దరిల్లిన సభ | Uttam Kumar Speech at Nakrekal