తెలంగాణ ఎన్నికల ఫలితాలు..జోతిష్యులు ఏమన్నారంటే..

By ramya neerukondaFirst Published Dec 8, 2018, 11:19 AM IST
Highlights

ఈ ఫలితాలపై ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలయ్యాయి.  వాటిని కాసేపు పక్కన పెడితే.. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై కొందరు జోతిష్యులు స్పందించారు.
 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిన్నటితో ముగిసింది. ఈ ఫలితాలపై ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలయ్యాయి.  వాటిని కాసేపు పక్కన పెడితే.. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై కొందరు జోతిష్యులు స్పందించారు.

జాతకాలు, వాటి రాశుల ప్రకారం.. ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉందో, ఎవరు ముఖ్యమంత్రి పీఠం ఎక్కతారో వివరిస్తున్నారు. మరి వాళ్లు ఏం చెబుతున్నారో మనమూ ఓసారి చూసేద్దామా...

ప్రముఖ జోతిష్యులు మంథా సూర్యనారాయణ శర్మ .. ఎట్టి పరిస్థితుల్లో  కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేరని చెప్పారు. మరో జోతిష్యులు జీవీఎల్ఎన్  చార్యులు.. కేసీఆర్  ముఖ్యమంత్రి ఔతారని.. బీజేపీ  రెండో స్థానంలో ఉంటదని చెప్పారు.మరో జోతిష్యులు ముదిగొండ గోపి  డిసెంబర్ 7కేసీఆర్ కు అదృష్ఠ సంఖ్య అని.. ఆరోజే ఎన్నికలు కాబట్టి ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పారు.

మరో జోతిష్యులు కొత్తపల్లి సురేష్ శర్మ టీఆర్ఎస్ కు 74 సీట్లు వస్తాయని.. కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని  చెప్పారు. డా||కృష్ణమాచార్య మాత్రం మహాకూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు.మరో జోతిష్యులు నవీన్ కొండ రమణాచారి గారు కేసీఆర్ సీఎం అవుతారని అని చెప్పారు. ఇంకో జోతిష్యులు  మారెళ్ళ రవి  కేసీఆర్ సీఎం అవుతారని చెప్పారు.

ఇంకో జోతిష్య పండితులు  వేణుస్వామి మాత్రం  రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. వీరిలో చాలా మంది కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. కొంద్ది మంది మాత్రం కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. ఇంకొకరైతే రేవంత్ రెడ్డి సీఎం అవుతారన్నారు. మరి వీరిలో ఎవరి వాక్కు నిజం కానుందో చూడాలి. 

click me!