ఉగ్రవాదుల ఉరిపై ఓవైసీ ఆగ్రహం

Published : Dec 20, 2016, 02:26 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
ఉగ్రవాదుల ఉరిపై ఓవైసీ ఆగ్రహం

సారాంశం

ఎన్ ఐ ఏ ది ద్వంద్వ వైఖరని ధ్వజం

 

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ ఐ ఏ పై కోపం వచ్చింది.

 

దిల్‌సుఖ్‌నగర్ బాంబుపేలుళ్ల కేసు దర్యాప్తును వేగంగా దర్యాప్తు చేసి నిందితులకు ఉరి వేయించిన

 

ఎన్ ఐ ఏ దేశంలోని మిగతా కేసులను ఎందుకు అంత వేగంగా దర్యాప్తు చేయడం లేదని ఆరోపించారు.

 

మక్కామసీద్, అజ్మీర్ దర్గా, మాలేగావ్ పేలుళ్ల దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. వీటి కేసులను కూడా ఎన్ ఐ ఏ నే దర్యాప్తు చేస్తోందని గుర్తు చేశారు.

 

దిల్‌సుఖ్‌నగర్‌ కేసులో మూడేళ్లలో తీర్పు వచ్చేంది, మిగతా కేసుల్లో మాత్రం ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇది ఎన్ ఐ ఏ ద్వంద్వ వైఖరికి నిరదర్శనమన్నారు.

 

1992లో జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసం పై ఇప్పటికీ దర్యాప్తు జరుపుతూనే ఉన్నారు ఎద్దేవా చేశారు.

 

నిందితులు ముస్లిమేతరులు అయితే దర్యాప్తు నత్తనడకన సాగుతోందని ఆరోపించారు.

PREV
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు