నాపై పోటీ చెయ్యండి: రాహుల్, అమిత్ షాలకు అసదుద్దీన్ ఓవైసీ సవాల్

By Nagaraju TFirst Published Oct 20, 2018, 4:53 PM IST
Highlights

ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలు హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చెయ్యాలని సవాల్ విసిరారు. తనపై అమిత్ షా, రాహుల్ గాంధీలు పోటీ చేయాలంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
 

హైదరాబాద్: ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలు హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చెయ్యాలని సవాల్ విసిరారు. తనపై అమిత్ షా, రాహుల్ గాంధీలు పోటీ చేయాలంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

మూసీ సంప్రదాయానికి చార్మినార్‌ ప్రతీక అని అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు ఎవరైనా రావొచ్చని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణలోని కామారెడ్డి, భైంసాలో జరుగుతున్న కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్న సమయంలో అసదుద్దీన్ ఓవైసీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 

click me!