టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు.. సిట్ అదుపులో మరో ఇద్దరు , కరీంనగర్‌లో తండ్రీకూతుళ్ల అరెస్ట్

Siva Kodati |  
Published : Jul 12, 2023, 10:17 PM IST
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు..  సిట్ అదుపులో మరో ఇద్దరు , కరీంనగర్‌లో తండ్రీకూతుళ్ల అరెస్ట్

సారాంశం

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరిని సిట్ అరెస్ట్ చేసింది. కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్, అతని కుమార్తె సాహితీలను సిట్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరిని సిట్ అరెస్ట్ చేసింది. కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్, అతని కుమార్తె సాహితీలను సిట్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. పోల రమేష్ సహకారంతో సాహితి మాస్ కాపీయింగ్‌కు పాల్పడినట్లుగా సమాచారం . కూతురు పరీక్ష కోసం పోల రమేష్ నుంచి శ్రీనివాస్ ఏఈఈ పరీక్ష పత్రాన్ని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. రమేశ్‌కు శ్రీనివాస్ డబ్బులు కూడా చెల్లించినట్లే తేలింది. తాజా అరెస్ట్‌లతో కలిపి పేపర్ లీక్ కేసులో మొత్తం అరెస్ట్‌ల సంఖ్య 80కి చేరుకుంది. 

Also Read: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ స్కాం: మరో ముగ్గురు అరెస్ట్

ఇకపోతే.. పేపర్ లీక్ కేసులో మంగళవారం సిట్ ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. విద్యుత్ శాఖలో డీఈగా పనిచేసిన రమేష్ నుండి  వీరు  ఏఈఈ పరీక్ష పేపర్ ను తీసుకున్నట్టుగా  సిట్ గుర్తించింది.  పరీక్ష రాసి ఉద్యోగం వచ్చిన తర్వాతే డబ్బులు ఇవ్వాలని రమేష్ వీరితో ఒప్పందం చేసుకున్నాడు. సుమారు  30 మందికి  రమేష్ ఏఈఈ పరీక్ష పేపర్ ను ఇచ్చినట్టుగా  సిట్ గుర్తించింది.  
 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్