గవర్నర్ తో కేటీఆర్ భేటీ... మెట్రో ప్రారంభంపై ట్వీట్

Published : Sep 19, 2018, 06:58 PM ISTUpdated : Sep 19, 2018, 07:02 PM IST
గవర్నర్ తో కేటీఆర్ భేటీ... మెట్రో ప్రారంభంపై ట్వీట్

సారాంశం

కొద్దిసేపటి క్రితమే మంత్రి కేటీఆర్ అమీర్ పేట-ఎల్బీ నగర్ మార్గంలో మెట్రో ప్రారంభోత్సవానికి సంబంధించిన వివరాలను ప్రకటించారు. ఈ నెల 24 వ తేదీన 12.15 గంటలకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చేతులమీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందంటూ మంత్రి ట్వీట్ చేశారు.   

నగరవాసుల ట్రాపిక్ కష్టాలను తీర్చడానికి హైదరాబాద్ లో చేపడుతున్న బృహత్తర ప్రాజెక్టు మెట్రో రైలు. ఈ మెట్రో ప్రాజెక్టు పిపిపి (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్) పద్దతిలో చేపడుతున్న అతిపెద్ద ప్రాజెక్టు కావడంతో దీనిపై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఈ హైదరాబాద్ మెట్రో రైలు మియాపూర్ - నాగోల్ మార్గాల్లో గత సంవత్సరమే అందుబాటులోకి వచ్చింది. అయితే దీని తర్వాత ఎప్పుడెప్పుడా అని నగరవాసులు ఎదురుచూస్తున్న అమీర్ పేట-ఎల్బీనగర్ మార్గం త్వరలో అందుబాటులోకి రానుంది. దీని ప్రారంభోత్సవానికి సంబంధించిన వివరాలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. 

కొద్దిసేపటి క్రితమే మంత్రి కేటీఆర్ అమీర్ పేట-ఎల్బీ నగర్ మార్గంలో మెట్రో ప్రారంభోత్సవానికి సంబంధించిన వివరాలను ప్రకటించారు. ఈ నెల 24 వ తేదీన 12.15 గంటలకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చేతులమీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందంటూ మంత్రి ట్వీట్ చేశారు. 


 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్