ఈ నెల 18న తెలంగాణకు ఖర్గే: నేతలకు దిశా నిర్ధేశం

Published : Aug 08, 2023, 05:07 PM IST
ఈ నెల  18న  తెలంగాణకు ఖర్గే: నేతలకు దిశా నిర్ధేశం

సారాంశం

ఈ నెల  18న  ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే  తెలంగాణకు  రానున్నారు. తెలంగాణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై  నేతలకు దిశా నిర్ధేశం  చేయనున్నారు.

హైదరాబాద్: ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ నెల  18వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. పార్లమెంట్ సమావేశాలు  పూర్తైన తర్వాత  ఎన్నికలు జరిగే  ఐదు రాష్ట్రాల్లో  పర్యటించనున్నారు.  ఇందులో భాగంగానే ఈ నెల 18న మల్లికార్జున ఖర్గే  తెలంగాణలో పర్యటిస్తారు.  ఈ ఐదు రాష్ట్రాల్లో ప్రధానంగా  తెలంగాణపై  కాంగ్రెస్ పార్టీ  ప్రధానంగా ఫోకస్ పెట్టింది.  తెలంగాణ ప్రత్యేక  రాష్ట్రం ఏర్పాటు  చేసిన తర్వాత రెండు దఫాలు  కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారాన్ని కోల్పోయింది.   ఈ దఫా  తెలంగాణలో  అధికారాన్ని దక్కించుకోవాలని  కాంగ్రెస్ పార్టీ  పట్టుదలతో ఉంది.

ఈ దిశగా  ఆ పార్టీ  వ్యూహ రచన చేస్తుంది.  ఆయా రాష్ట్రాల్లో  ఏ రకమైన వ్యూహంతో ఎన్నికలకు వెళ్లాలనే దానిపై  రాహుల్ గాంధీతో మల్లికార్జున ఖర్గే చర్చించారు. ఈ ఐదు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీలను నియమించారు.  తెలంగాణకు  కేరళ ఎంపీ మురళీధరన్ నేతృత్వంలో  స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు  చేశారు.

ఈ దఫా ఎన్నికల్లో చావోరేవో తేల్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్టుదలగా ఉంది.  తెలంగాణలో ఎన్నికలకు సమయం తక్కువగా ఉంది. దీంతో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం,  రాష్ట్రంలో  పార్టీ పరిస్థితి,  ఇతర పార్టీల బలబలాలపై  చర్చించనున్నారు.

ఎన్నికల్లో ఏ రకంగా  వెళ్తే  ఫలితాలు దక్కుతాయనే విషయమై  నేతలతో ఖర్గే చర్చించనున్నారు.తెలంగాణ రాష్ట్రంలో   కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఏ వ్యూహం అనుసరించాలనే దానిపై  కూడ  ఖర్గే చర్చించనున్నారు.రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో  పార్టీ స్థితిగతులపై  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటుంది. కర్ణాటక  తరహాలోనే తెలంగాణలో కూడ అధికారంలోకి రావాలని  కాంగ్రెస్ నాయకత్వం  భావిస్తుంది.

PREV
click me!

Recommended Stories

ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu