జూబ్లీహిల్స్ లో ఏపీ మాజీ ఉన్నతాధికారి కొడుకుపై ఆఫ్రికన్ల దాడి...

Published : Sep 14, 2023, 09:37 AM IST
జూబ్లీహిల్స్ లో ఏపీ మాజీ ఉన్నతాధికారి కొడుకుపై ఆఫ్రికన్ల దాడి...

సారాంశం

హైదరాబాద్ లోని ఓ పబ్ లో పార్కింగ్ ఏరియాలో గొడవ జరిగింది. ఈ గొడవలో ఆఫ్రికన్లు  ఏపీ మాజీ ఉన్నతాధికారి కొడుకుపై దాడి చేశారు. 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఏపీ మాజీ ఉన్నతాధికారి కొడుకుపై ఆఫ్రికన్లు దాడి చేశారు. జీరో 40 పబ్ లో గొడవ సందర్బంగా ఈ దాడి జరిగినట్లు సమాచారం. మొత్తం ఆరుగురు కలిసి అతని మీద దాడి చేశారు.  

ఈ ఆరుగురిలో ముగ్గురు ఆఫ్రికన్లు ఉన్నారు. పార్కింగ్ ఏరియాలో గొడవ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. బాధితుడికి మొహం, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu