సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి...

Published : Mar 02, 2023, 07:37 AM IST
సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి...

సారాంశం

సంగారెడ్డిలో ఓ లారీ అదుపుతప్పి గుడిసెల మీదికి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. 

సంగారెడ్డి : తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. సంగారెడ్డి జిల్లా కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద లారీ బీభత్సం సృష్టించింది. ఎగ్జిట్ గేట్ వద్ద లారీ అదుపు తప్పి గుడిసెలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మరణించారు. లారీ పటాన్ చెరు నుంచి శంషాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్
JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?