ఓటుకు నోటు కేసు.. రేవంత్ రెడ్డి డ్రైవర్ కి ఏసీబీ బెయిలబుల్ వారెంట్

Published : Jul 30, 2021, 08:01 AM IST
ఓటుకు నోటు కేసు.. రేవంత్ రెడ్డి డ్రైవర్ కి ఏసీబీ బెయిలబుల్ వారెంట్

సారాంశం

సాక్షులుగా విచారణకు హాజరుకావాలని ఓటుకు నోటు కేసు  సమయంలో రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న ఆయన డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి, వ్యక్తిగత సహాయకుడు సైదయ్యకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.


ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి డ్రైవర్, పీఏ పై ఏసీబీ( అవినీతి నిరోదక శాఖ) ప్రత్యేక న్యాయస్థానం బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.  సాక్షులుగా విచారణకు హాజరుకావాలని ఓటుకు నోటు కేసు  సమయంలో రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న ఆయన డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి, వ్యక్తిగత సహాయకుడు సైదయ్యకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.

సమన్లు తీసుకున్నప్పటికీ నిన్న విచారణకు గైర్హాజరు కావడంతో ఇద్దరికీ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన ఏసీబీ కోర్టు... ఆగస్టు 9న హాజరుకావాలని స్పష్టం చేసింది. నిందితుల్లో ఉదయ్ సింహా నిన్న విచారణకు హాజరయ్యారు. ఓటుకు నోటు కేసు విచారణను ఏసీబీ కోర్టు  నేటికి వాయిదా వేసింది. 
 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!