Corona Cases: తెలంగాణలో మరో 8 కరోనా కేసులు.. 30 శాంపిళ్ల రిజల్ట్ పెండింగ్

Published : Dec 27, 2023, 12:33 AM IST
Corona Cases: తెలంగాణలో మరో 8 కరోనా కేసులు.. 30 శాంపిళ్ల రిజల్ట్ పెండింగ్

సారాంశం

తెలంగాణలో కొత్తగా మరో 8 మంది కరోనా బారిన పడ్డారు. 1,333 మందికి గడిచిన 24 గంటల్లో టెస్టులు చేశారు. కాగా, మరో 30 మంది ఫలితాలు రావాల్సి ఉన్నది. రాష్ట్రంలో ఇప్పుడు చికిత్స తీసుకుంటున్న లేదా.. ఐసొలేషన్‌లో ఉన్నవారి సంఖ్య 59కు చేరింది.  

Covid 19: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి కోరలు చాస్తున్నది. 2020 నుంచి ఈ వైరస్ మహమ్మారి రూపంలో ప్రపంచాన్నే వణికించింది. ఇటీవల ఇది వెనక్కి తగ్గిందని ఊపిరిపీల్చుకుంటున్న సందర్భంలో మరోసారి అది దాని ఉనికిని ప్రదర్శిస్తున్నది. ఇప్పుడు కొత్తగా జేఎన్1 వేరియంట్‌తో కొత్తరూపాన్ని ఎత్తింది. రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి.

మంగళవారం ఒక్క రోజే రాష్ట్రంలో 8 మందికి వైరస్ వ్యాప్తి చెందింది. దీంతో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 59కి పెరిగింది. గత 24 గంటల్లో (మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు) మొత్తం 1,333 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ 24 గంటల్లో 8 మందికి కరోనా పాజిటివ్‌గా రిజల్ట్స్ వచ్చాయి. మరో 30 మంది శాంపిళ్ల రిజల్ట్స్ రావాల్సి ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం బులెటిన్‌లో పేర్కొంది.

Also Read: రేపల్లే వైసీపీ ఇంచార్జీ మార్పు.. ఆయనను అంత సింపుల్‌గా వదులుకోను: వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ

ఏమాత్రం అలసత్వంగా ఉన్న వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. అందరూ జాగరూకతగా, ముందు జాగ్రత్తలు పాటిస్తేనే ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. జేఎన్1 వేరియంట్ ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని చెబుతున్నారు. అయినా.. ముందు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?