పేషెంట్ల మందులు కొట్టేసి.. బ్లాక్ మార్కెట్‌కు: హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రుల దందా

Siva Kodati |  
Published : Jul 18, 2020, 04:10 PM IST
పేషెంట్ల మందులు కొట్టేసి.. బ్లాక్ మార్కెట్‌కు: హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రుల దందా

సారాంశం

హైదరాబాద్‌లో యాంటీ వైరల్ డ్రగ్స్‌ను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్న మరో ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్లాక్‌లో యాంటీ వైరల్ డ్రగ్స్ అమ్మకాల్లో ప్రైవేటు ఆసుపత్రుల పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు

హైదరాబాద్‌లో యాంటీ వైరల్ డ్రగ్స్‌ను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్న మరో ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్లాక్‌లో యాంటీ వైరల్ డ్రగ్స్ అమ్మకాల్లో ప్రైవేటు ఆసుపత్రుల పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

పేషెంట్లకు మందులు ఇచ్చినట్లు ఇచ్చి.. వాటిని కొట్టేసి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. పేషెంట్లకు ఇవ్వాల్సిన ఆరు డోసుల్లో కొన్నింటిని కొట్టేసి.. వాటిని బహిరంగ మార్కెట్‌కు తరలించి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

వీరిలో 8 మందిని హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.4 వేల విలువైన మందుల్ని రూ.40 వేలకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.

బ్లాక్‌లో మందుల అమ్మకాల్లో ఎల్‌బీ నగర్, లంగర్ హౌజ్‌లోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల పాత్ర ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది ద్వారా యాంటీ వైరల్ డ్రగ్స్ బయటకు వస్తున్నట్లుగా గుర్తించారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.
Hyderabad: ఇక‌పై గోవా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో 35 ఎకరాల్లో, రూ. 350 కోట్లతో అద్భుత నిర్మాణం