నిజామాబాద్ కలెక్టరేట్ లో కరోనా కలకలం: డీఆర్వో అటెండర్ మృతి

Published : Jul 18, 2020, 11:04 AM IST
నిజామాబాద్ కలెక్టరేట్ లో కరోనా కలకలం: డీఆర్వో అటెండర్ మృతి

సారాంశం

నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం సముదాయంలో కరోనా వైరస్ కలకలం చెలరేగింది. కాంప్లెక్సు ఆవరణలోని డీఆర్వో కార్యాలయంలో కరోనాతో ఓ అటెండర్ మరణించాడు.

నిజామాబాద్: నిజామాబాద్ లో కరోనా విలయతాండవం చేస్తోంది. నిజామాబాద్ జిల్లా కరోనా వైరస్ తో తల్లడిల్లుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కరోనావైరస్ కలకలం చెలరేగింది. కలెక్టర్ కార్యాలయం కాంప్లెక్స్ లోని డీఆర్వో కార్యాలయంలో అటెండర్ గా పనిచేసే వ్యక్తి మరణించారు. 

ఈ నెల 9వ తేదీ రాత్రి నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో నలుగురు కరోనా రోగులు మరణించారు. ఆక్సిజన్ అందకపోవడం వల్లనే రోగులు మరణించారని వారి బంధువులు ఆరోపించారు. దాంతో ఈ నెల 10వ తేదీన ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదిలావుంటే, కరోనా మృతుడిని ఈ నెల 11వ తేదీన ఆటోలో తరలించిన సంఘటన తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ ఘటనపై డిఎంఈ రమేష్ విచారణకు ఆదేశించారు. ప్రోటోకాల్ ను పాటించకుండా మృతదేహాన్ని తరలించడమే వివాదానికి కారణమైంది. 

ఈ వరుస ఘటనల నేపథ్యంలోనిజామాబాద్ జిల్లా ప్రభుత్వాస్పత్రి సూపరింటిండెంట్ నాగేశ్వర రావు రాజీనామా కూడా చేశారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.
Hyderabad: ఇక‌పై గోవా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో 35 ఎకరాల్లో, రూ. 350 కోట్లతో అద్భుత నిర్మాణం