ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చూడటానికి తప్ప తాగి వచ్చిన కొందరు యువతి, యువకులు స్టేడియంలో హల్ చల్ చేశారు.
ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చూడటానికి తప్ప తాగి వచ్చిన కొందరు యువతి, యువకులు స్టేడియంలో హల్ చల్ చేశారు. సన్రైజర్స్ హైదరాబాద్-కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ చూడటానికి ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు వచ్చారు.
అంతకు ముందే పీకల్లోతు మద్యం తాగి వచ్చిన ఆరుగురు యువతీ, యువకులు ప్రేక్షకులను ఇబ్బంది పెట్టారు. కూర్చొని మ్యాచ్ చూడకుండా వికృత చేష్టలతో సంతోష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తితో అసభ్యంగా ప్రవర్తించారు.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన విధుల్లో ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు పూర్ణిమ, ప్రశాంతి, శ్రీకాంత్ రెడ్డి, సురేశ్, వేణుగోపాల్ అనే యువతీ, యువకులుగా గుర్తించారు.