సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. మృతుల్లో 8 నెలల చిన్నారి

By Sumanth KanukulaFirst Published Jan 1, 2022, 3:50 PM IST
Highlights

తెలంగాణలోని సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసకుంది. జిల్లాలోని జహీరాబాద్‌ మండలం డిడ్గీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతుల్లో 8 నెలల చిన్నారి కూడా ఉంది. 

తెలంగాణలోని సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసకుంది. జిల్లాలోని జహీరాబాద్‌ మండలం డిడ్గీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతుల్లో 8 నెలల చిన్నారి కూడా ఉంది. వివరాలు.. డిడ్గీ వద్ద కారు బీభత్సం సృష్టించింది. వేగంతో వచ్చి రోడ్డుపై వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌‌పై వెళ్తున్న దంపతులతో పాటు, వారి పాప మృతిచెందింది. బైక్‌ను ఢీకొట్టిన అనంతరం కారు అదుపు  తప్పి పల్టీలు కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మృతిచెందాడు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బైక్‌పై వెళ్తూ మృతిచెందిన వారిని బాలరాజు(28, శ్రావణి (22).. వారి కూతురు  అమ్ములు (8 నెలలు)గా గుర్తించారు. వీరి స్వస్థలం అనంతపురం జిల్లాలోని గుత్తి మండలం బాచుపల్లి. మరోవైపు కారులో ప్రయాణిస్తు మృతిచెందిన వ్యక్తిని వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూరుకు చెందిన ఫరీద్‌‌(25) గా గుర్తించారు. 

విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి..
విశాఖపట్నంలో (Visakhapatnam) కొత్త సంవత్సరం తొలి రోజే ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. విశాఖ ఆరిలోవ బీఆర్‌టీఎస్ రోడ్‌లో (BRTS Road) పెద్దగదిలి దగ్గర శనివారం ఉదయం ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బైక్‌లు ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరోకరు గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. 

click me!