తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరిగి: తెలంగాణలో కొత్తగా 22 కేసులు, ముగ్గురు మృతి.. 1.038కి చేరిన సంఖ్య

By Siva KodatiFirst Published Apr 30, 2020, 9:45 PM IST
Highlights

తెలంగాణలో గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసుల సంఖ్య గురువారం మళ్లీ పెరిగింది. ఇవాళ కొత్తగా 22 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 1038కి చేరింది.

తెలంగాణలో గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసుల సంఖ్య గురువారం మళ్లీ పెరిగింది. ఇవాళ కొత్తగా 22 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 1038కి చేరింది. అలాగే ఇవాళ ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 28కి చేరింది.

గురువారం 33 మంది డిశ్చార్జ్ కావడంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 442కి చేరింది. దీంతో రాష్ట్రంలో 568 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. 

Also Read:కరోనా లాక్ డౌన్: తెలంగాణాలో రెడ్, గ్రీన్ జోన్ల పూర్తి లిస్ట్ ఇదే...

మరోవైపు కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ అమలు తదితర పరిస్ధితులపై చర్చించేందుకు గాను ఈ నెల 5న తెలంగాణ మంత్రిమండలి సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఈ భేటీ జరగనుంది.

దేశవ్యాప్తంగా మే 3 వరకు, తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో 7వ తేదీతో లాక్‌డౌన్ ముగియనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై మంత్రిమండలి చర్చించనుంది. లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలా..? లేక మరోసారి పొడిగించాలా..? అనే దానిపై కేబినెట్‌లో నిర్ణయించనున్నారు.

Also Read:లాక్‌డౌన్ పొడిగిస్తారా.. ఎత్తేస్తారా..? : 5న తెలంగాణ కేబినెట్ భేటీ, కేసీఆర్ నిర్ణయంపై ఆసక్తి

ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో లాక్‌డౌన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి నెలకొంది. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

కాగా లాక్‌డౌన్ మూడు రోజుల్లో ముగుస్తున్నందున కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపులకు సంబంధించి రాష్ట్రాల వారీగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది. కేసులు అధికంగా నమోదైన కస్టర్లు ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించారు.

click me!