24 గంటల్లో 214 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,65,963కి చేరిన కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Sep 30, 2021, 10:12 PM IST
24 గంటల్లో 214 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,65,963కి చేరిన కేసుల సంఖ్య

సారాంశం

తెలంగాణలో కొత్తగా 214 కరోనా కేసులు నమోదవ్వగా.. వైరస్ వల్ల ఇద్దరు మరణించారు. 208 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 4,624 యాక్టివ్‌ కేసులు వున్నాయి.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 46,190 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 214 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 64 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 16, నల్గొండ జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. నిర్మల్, నారాయణపేట, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 208 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,65,963 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,57,421 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 4,624 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,918కి పెరిగింది. 

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 6, జీహెచ్ఎంసీ 64, జగిత్యాల 9, జనగామ 6, జయశంకర్ భూపాలపల్లి 1, గద్వాల 1, కామారెడ్డి 0, కరీంనగర్ 16, ఖమ్మం 11, మహబూబ్‌నగర్ 4, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 3, మంచిర్యాల 11, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 12, ములుగు 0, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 13, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 2 , పెద్దపల్లి 4, సిరిసిల్ల 6, రంగారెడ్డి 10, సిద్దిపేట 4, సంగారెడ్డి 2, సూర్యాపేట 7 వికారాబాద్ 1, వనపర్తి 1, వరంగల్ రూరల్ 3, వరంగల్ అర్బన్ 10, యాదాద్రి భువనగిరిలో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి.

 

PREV
click me!

Recommended Stories

Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం
MLC Kavitha: బబుల్ షూటర్ వల్లే కేసిఆర్ కి ట్రబుల్ హరీశ్ రావుపై కవిత సెటైర్లు | Asianet News Telugu