24 గంటల్లో కేవలం 162 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,67,887కి చేరిన కేసుల సంఖ్య

By Siva KodatiFirst Published Oct 10, 2021, 9:05 PM IST
Highlights

తెలంగాణ (Telangana)లో కొత్తగా 162 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు (corona deaths in telangana) మరణించారు. 214 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 4,235యాక్టివ్‌ కేసులు వున్నాయి.
 

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో గత 24 గంటల్లో 33,506 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 162 పాజిటివ్‌ (corona cases) కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 6,67,887కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. కరోనాతో ఒకరు మృతి చెందగా.. తెలంగాణలో ఇప్పటి వరకు వైరస్‌తో (corona deaths in telangana) మరణించిన వారి సంఖ్య 3,930కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 214 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 4,235 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.   

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 9, జీహెచ్ఎంసీ 55, జగిత్యాల 1, జనగామ 0, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 2, కామారెడ్డి 0, కరీంనగర్ 10, ఖమ్మం 4, మహబూబ్‌నగర్ 5, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 2, మంచిర్యాల 1, మెదక్ 4, మేడ్చల్ మల్కాజిగిరి 10, ములుగు 0, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 11, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 1, పెద్దపల్లి 2, సిరిసిల్ల 2, రంగారెడ్డి 11, సిద్దిపేట 7, సంగారెడ్డి 5, సూర్యాపేట 5, వికారాబాద్ 1, వనపర్తి 1, వరంగల్ రూరల్ 4, వరంగల్ అర్బన్ 7, యాదాద్రి భువనగిరిలో 0 చొప్పున కేసులు నమోదయ్యాయి.

 

Media Bulletin on status of positive cases in Telangana.
(Dated.10.10.2021 at 5.30pm) pic.twitter.com/iyF798hj9H

— IPRDepartment (@IPRTelangana)
click me!