
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో వున్న ఓటర్లకు ఎన్నికల సంఘం ఓటు వేసే అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను 2,290 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 3.26 కోట్ల మంది ఓటర్లు అభ్యర్ధుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. రాష్ట్రంలో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే ఎక్కువగా వున్నారు. దాదాపు 68 నియోజకవర్గాల్లో అభ్యర్ధుల గెలుపు, ఓటములను వారే శాసించనున్నారు.
రేస్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని అంచనా వేసింది. బీఆర్ఎస్కు 48 + or -3 , కాంగ్రెస్కు 62 + or -5, బీజేపీకి + or -2, ఎంఐఎం 6 + or - 1, ఇతరులు 1 + or -2 స్థానాలు కైవసం చేసుకుంటారని రేస్ సంస్థ అంచనా వేసింది.
ALso Read: Telangana Exit Poll Result 2023: పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ కు 72 స్థానాలు