Sonia Gandhi : మార్పు కోసం ఓటేయ్యండి.. దొరల తెలంగాణను , ప్రజల తెలంగాణగా మారుద్దాం : సోనియా గాంధీ సందేశం

Siva Kodati |  
Published : Nov 28, 2023, 03:19 PM ISTUpdated : Nov 28, 2023, 03:28 PM IST
Sonia Gandhi : మార్పు కోసం ఓటేయ్యండి.. దొరల తెలంగాణను , ప్రజల తెలంగాణగా మారుద్దాం : సోనియా గాంధీ సందేశం

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారంతో ప్రచార గడువు ముగియనుండటంతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీ రాష్ట్ర ప్రజలకు వీడియో సందేశం పంపారు. తెలంగాణ అమరవీరుల ఆకాంక్ష నెరవేరాలని.. ఈ ప్రేమ , అభిమానాలకు తాను ఎప్పటికీ రుణపడి వుంటానని సోనియా గాంధీ స్పష్టం చేశారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారంతో ప్రచార గడువు ముగియనుండటంతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీ రాష్ట్ర ప్రజలకు వీడియో సందేశం పంపారు. దొరల తెలంగాణను, ప్రజల తెలంగాణగా మారుద్దామని ఆమె పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యాలని, నిజాయితీ గల ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సోనియా గాంధీ సూచించారు. తెలంగాణ ప్రజల మధ్యకు రాలేకపోయానని.. కానీ ప్రజల హృదయాలకు చాలా దగ్గరయ్యానని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. మార్పు కోసం ఓటేయ్యాలని.. నన్ను సోనియమ్మ అని పిలిచి నాకు గౌరవమిచ్చారని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అమరవీరుల ఆకాంక్ష నెరవేరాలని.. ఈ ప్రేమ , అభిమానాలకు తాను ఎప్పటికీ రుణపడి వుంటానని సోనియా గాంధీ స్పష్టం చేశారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana: గొప్ప మ‌న‌సు చాటుకున్న సీఎం రేవంత్‌.. రూ. 12 లక్ష‌ల ఆర్థిక సాయం
weather alert: మ‌ళ్లీ వ‌ర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు