రాహుల్ గాంధీ న్యాయం వైపు ఉన్నారు... విజయశాంతి

By ramya NFirst Published Apr 2, 2019, 3:22 PM IST
Highlights

దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతున్నవని తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి అభిప్రాయపడ్డారు.  


దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతున్నవని తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి అభిప్రాయపడ్డారు.  ప్రధాని నరేంద్రమోదీ అన్యాయం వైపు ఉంటే.. రాహుల్ గాంధీ న్యాయం వైపు ఉన్నారన్నారు.

మంగళవారం సంగారెడ్డి నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో విజయశాంతి మాట్లాడారు. కాంగ్రెస్‌ను లేకుండా చేయాలనుకుంటున్న కేసీఆర్, మోదీల కుట్రలను పటాపంచలు చేస్తామని అన్నారు. రాహుల్ మాట ఇస్తే కట్టుబడి ఉంటారని చెప్పుకొచ్చిన విజయశాంతి.. మోదీ మాట ఇవ్వడమే తప్ప అమలు చేయరని విమర్శించారు.

click me!