కేసీఆర్- ఒవైసీలు మోడీ అనుచరులే: కాంగ్రెస్

By Siva KodatiFirst Published Apr 7, 2019, 9:59 AM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ( నిజమైన హిందూ) అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సంబోధించడం పట్ల కాంగ్రెస్  పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ( నిజమైన హిందూ) అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సంబోధించడం పట్ల కాంగ్రెస్  పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఎన్నికలకు పట్టుమని ఐదు రోజులు కూడా లేవని టీఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ ఇంతవరకు మేనిఫెస్టో ప్రకటించలేదన్నారు.

రెండు పార్టీలు కూడా హిందూ-ముస్లిం సెంటిమెంట్‌తో లాభపడాలని చూస్తున్నాయని హైదరాబాద్ నగర కాంగ్రెస్ మైనారిటీ సెల్ ఛైర్మన్ సమీర్ ‌వలీవుల్లాహ్ ఆరోపించారు. ఎంఐఎం నేతలు ముస్లిమ్స్ కాదని వారంతా ఇప్పుడు కొందరికి హిందువులుగా సర్టిఫికేట్లు ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారని సమీర్ ఎద్దేవా చేశారు.

కేసీఆర్‌ నిజమైన హిందూ అనడానికి ఆయనలో ఏం చూశారంటూ సమీర్.. ఒవైసీని ప్రశ్నించారు. కేసీఆర్ తొలి నుంచి ప్రధాని మోడీ భక్తుడని... చంద్రశేఖర్ రావు, ఒవైసీ ఇద్దరు ‘‘మోడీత్వ’’ను ప్రచారం చేస్తున్నారని తద్వారా దేశంలోని సెక్యులర్ శక్తులను నాశనం చేయ్యాలన్నదే వీరిద్దరి ఆశయమని సమీర్ ఆరోపించారు. కేసీఆర్-ఒవైసీ మాయలో పడొద్దని హస్తం గుర్తుకే ఓటు వేయ్యాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

click me!