ఉక్రెయిన్-రష్యా సంక్షోభం, చైనా లాక్‌డౌన్‌ కారణంగా పెరగనున్న టీవీల ధరలు.. కొనుగోలుదారులపై మరింత భారం..

Ashok Kumar   | Asianet News
Published : Apr 18, 2022, 10:40 AM ISTUpdated : Apr 18, 2022, 04:32 PM IST
ఉక్రెయిన్-రష్యా సంక్షోభం, చైనా లాక్‌డౌన్‌ కారణంగా పెరగనున్న టీవీల ధరలు.. కొనుగోలుదారులపై మరింత భారం..

సారాంశం

ఉక్రెయిన్ - రష్యా మధ్య దాదాపు రెండు నెలల సుదీర్ఘ వివాదం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ కంపెనీలపై ప్రభావం చూపిస్తుంది. అయితే భారతదేశంలోని టీవీ తయారీదారులకు ఈ ప్రభావం పెద్దదిగా మారుతోంది.

భారతదేశంలోని టీవీ తయారీ  సంస్థలు కొనసాగుతున్న ధర, సరఫరా పరిమితులకు అనుగుణంగా వాటి మోడల్స్ ధరలను పెంచాలని యోచిస్తున్నాయి. ఉక్రెయిన్ - రష్యా మధ్య సంక్షోభం, చైనాలో కఠినమైన లాక్‌డౌన్‌ కారణంగా రాబోయే రోజుల్లో కంపెనీలు టీవీల ధరలను పెంచాలని యోచిస్తున్నాయని ఒక నివేదిక పేర్కొంది. కొన్ని విదేశీ పరిమితుల వల్ల టి‌వి తయారీదారులకు ముడి పదార్థాల తగిన సరఫరాల పొందకుండా పరిమితం చేస్తున్నాయి దీంతో చివరికి ఆ భారాన్ని వినియోగదారులపై బదిలీ చేయవలసి వస్తుంది అని తెలిపారు.

ఉక్రెయిన్ - రష్యా మధ్య దాదాపు రెండు నెలల సుదీర్ఘ వివాదం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ కంపెనీలపై ప్రభావం చూపిస్తుంది. అయితే భారతదేశంలోని టీవీ తయారీదారులకు ఈ ప్రభావం పెద్దదిగా మారుతోంది, ఎందుకంటే మార్కెట్‌లోని చాలా కంపెనీలు ఎంట్రీ-లెవల్ అండ్ బడ్జెట్ మోడల్‌ల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆర్జిస్తారు, అవి పొందేందుకు మార్జిన్‌లు కూడా ఉంటాయి.

ఉక్రెయిన్-రష్యా సంక్షోభంతో పాటు, చైనాలో లాక్‌డౌన్ కారణంగా కంపెనీలు సరఫరా అడ్డంకులను ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా తయారీదారులు దేశంలో సరుకుల కోసం ఎక్కువ చెల్లించవల్సి వస్తుంది. "వివిధ ముడి పదార్థాలు, సేవలు, ఉత్పత్తుల ధరలు కూడా కనీసం 5-10 శాతం పెరుగుదలను చూస్తాయి" అని నోయిడాకు చెందిన బ్లూపంక్ట్ , థామ్సన్ , కొడాక్ తయారీ సంస్థ సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ( SPPL) సి‌ఈ‌ఓ అవనీత్ సింగ్ మార్వా చెప్పారు.

చైనాలో లాక్‌డౌన్‌ల కారణంగా ఓడలు అకస్మాత్తుగా నిలిచిపోయాయని, అవన్నీ 100 శాతం సామర్థ్యంతో పనిచేయడం లేదని, దీని ఫలితంగా షిప్పింగ్‌లో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆయన సూచించారు. దీనివల్ల కస్టమర్లు కచ్చితంగా ప్రభావితమవుతారని హెచ్చరించారు.

SPPL లాగానే బెంగళూరుకు చెందిన ఇండ్‌కల్ టెక్నాలజీస్  భారతదేశంలోని Acer TVల బ్రాండ్ లైసెన్స్‌దారి కొంతకాలంగా సరఫరా చైన్ సమస్యలను చూస్తోంది.

"రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పరిస్థితులని మరింత దిగజార్చింది, ఎందుకంటే ఈ రెండు దేశాలు చిప్‌ల తయారీకి ముడిసరుకుగా ఉపయోగించే కొన్ని కీలకమైన ఖనిజాల అతిపెద్ద ఉత్పత్తిదారులుగా ఉన్నాయి, ఇవి ఇప్పటికే కొరతలో ఉన్నాయి" అని ఇండ్‌కల్ టెక్నాలజీస్ సి‌ఈ‌ఓ ఆనంద్ దూబే అన్నారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వివాదం మరింత కోనసాగితే, అది కాంపోనెంట్ ధరలలో పెద్ద పెంపుదలకు దారితీస్తుందని, భారతదేశంలో ఇంకా ప్రపంచవ్యాప్తంగా వివిధ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ధరలలో చాలా పెరుగుదలకు దారితీయవచ్చని అతను ఊహించాడు. ధరల పెంపుపై కచ్చితమైన శాతం ఇంకా అంచనా వేయాల్సి ఉంది. అయితే ధరల పెంపుదల ఈ నెల నుంచే అమల్లోకి రావచ్చని  అవనీత్ సింగ్ మార్వా సూచించారు.

గత రెండేళ్లలో టీవీ మార్కెట్ ధరల పెరుగుదలను చూడటం ఇదే మొదటిసారి కాదు. Xiaomi , Samsung , LG ఇంకా Realmeతో సహా కంపెనీలు గత ఏడాది అన్ని విభాగాలలో టీవీ సెట్‌ల ధరలను దాదాపు 10 శాతం పెంచాయి.

టీవీ బ్రాండ్‌లు ఈసారి టీవీ ధరలను పెద్దగా పెంచకపోవచ్చని హాంకాంగ్‌కు చెందిన మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ సీనియర్ అనలిస్ట్ అన్షికా జైన్ అన్నారు. టీవీ  ముడి పదార్థాల ధరలలో ప్రపంచవ్యాప్త పెరుగుదల రాబోయే భవిష్యత్తులో టీవీ ధరలను పెంచడానికి తయారీదారులను కూడా నెట్టివేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

కౌంటర్‌పాయింట్ ప్రకారం , భారతదేశంలో టీవీ షిప్‌మెంట్‌లు 2021లో సంవత్సరానికి 24 శాతం పెరిగాయి, స్మార్ట్ టీవీ మార్కెట్ సంవత్సర ప్రాతిపదికన 55 శాతంతో మరింత వేగంగా వృద్ధి చెందింది. Xiaomi, Samsung, LG, Sony, OnePlus వంటి కంపెనీలు గత ఏడాది దేశంలో స్మార్ట్ టీవీ షిప్‌మెంట్‌లకు నాయకత్వం వహించాయి.

PREV
click me!

Recommended Stories

Cheapest Recharge Plan : ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ రీచార్జ్ ప్లాన్
Samsung Galaxy S25 Ultra పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ. 34,000 తగ్గిన ధర