ప్రీపెయిడ్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఇక రిచార్జ్ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు..: ట్రాయ్ ఆర్డర్

By asianet news teluguFirst Published Jan 28, 2022, 12:58 AM IST
Highlights

ప్రీ-పెయిడ్ కస్టమర్ల కోసం టెలికాం ఆపరేటర్లు 30 రోజుల చెల్లుబాటుతో రీఛార్జ్ ప్లాన్‌లను అందించాల్సి ఉంటుందని రెగ్యులేటర్ ట్రాయ్ గురువారం తెలిపింది. ఈ చర్య ద్వారా ఒక సంవత్సరంలో వినియోగదారులు చేసే రీఛార్జ్‌ల సంఖ్యను తగ్గించగలదని భావిస్తున్నారు.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( TRAI) దేశీయ టెల్కో కంపెనీలు కనీసం ఒక టారిఫ్ ప్లాన్‌ అయిన 30 రోజుల రీఛార్జ్ వాలిడిటీ ఉండాలని ఆదేశించింది, టెలికమ్యూనికేషన్ ఆర్డర్‌ 1999కి మార్పు చేస్తూ, "ప్రతి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కనీసం ఒక ప్లాన్ వోచర్, ఒక ప్రత్యేక టారిఫ్ వోచర్, ఒక కాంబో వోచర్‌ 30 రోజుల వాలిడిటీతో అందించాలి" అని ట్రాయ్ గురువారం తెలిపింది. అలాగే ప్రతి నెలా అదే తేదీన పునరుద్ధరించబడుతుందని తేలిపింది.

టెలికాం రెగ్యులేటరీ ఈ చర్యను వినియోగదారులకు అనుకూలమైనదిగా వివరిస్తు అలాగే ఈ సవరణతో టెలికాం సబ్‌స్క్రైబర్‌లు సరైన వాలిడిటీ లేదా వ్యవధి ఉన్న  సర్వీస్ ఆఫర్‌లను ఎంచుకోవడానికి మరిన్ని ఆప్షన్స్ అందిస్తుందని వివరించింది. ఇంకా దీని వల్ల ఎక్కువ సమాచారంతో కూడిన టారిఫ్-సంబంధిత ఛాయిస్ చేసుకునేందుకు వినియోగదారులను సులభతరం చేస్తుంది.

 ట్రాయ్ గత ఏడాది మేలో ఒక సంప్రదింపు పత్రాన్ని విడుదల చేసింది, ఇందులో ఈ విషయంలో జోక్యం చేసుకోవాలా వద్దా అని మొత్తం వాటాదారులను కోరింది. ప్రతినెలా ప్లాన్‌ల కోసం సంవత్సరానికి 13 రీఛార్జ్‌లు చేస్తున్నామని, తద్వారా తాము మోసపోయినట్లు భావిస్తున్నామని వినియోగదారులు చెప్పిన వాటితో సహా ఎన్నో ఫిర్యాదులు కూడా అందాయని టెలికాం రెగ్యులేటర్ తెలిపింది.

టెల్కోలు, ఇతర వాటాదారుల ప్రతిస్పందనలను వివరిస్తూ టెలికాం రెగ్యులేటరి“టారిఫ్ ఆఫర్‌ల వాలిడిటీ వ్యవధికి సంబంధించి ప్రస్తుత సహనం పాలన కొనసాగింపు కోసం సర్వీస్ ప్రొవైడర్లు తమ ప్రాధాన్యతను పునరుద్ఘాటించడంతో వాటాదారుల అభిప్రాయాలు స్పష్టంగా విభజించింద” అని తెలిపింది.

మరోవైపు, వినియోగదారుల న్యాయవాద గ్రూపులు, కన్సల్టెన్సీ సంస్థలు అలాగే వ్యక్తిగత కస్టమర్లు 30 రోజుల టారిఫ్ ఆఫర్‌ను తప్పనిసరి చేయడంతో పాటు, ప్రతి నెలా అదే తేదీన రీఛార్జ్ చేయదగిన ప్రతినెల టారిఫ్ ఆఫర్‌ను కూడా అందించాలని అభిప్రాయపడ్డారు.

అంతర్జాతీయ ఆపరేటర్లను ఉదహరిస్తూ టెలికాం రెగ్యులేటర్ ఇదే కేసును రూపొందించింది. యూ‌కేలోని వోడాఫోన్ అండ్ యుఎస్‌లోని వెరిజోన్ ప్రతినెల ప్రీపెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉన్నాయని పేర్కొంది. "ప్రతి నెల అదే తేదీన రీఛార్జ్ చేయదగిన ప్రీపెయిడ్ టారిఫ్‌ల లభ్యత అంతర్జాతీయంగా ఉంది కాబట్టి, అలాంటి సదుపాయాన్ని భారతీయ టెలికాం వినియోగదారులకు ఎందుకు అందుబాటులోకి తీసుకురాకూడదు అనేదానికి కారణం కూడా లేదు" అని ట్రాయ్ చెప్పింది.టెలికాం రెగ్యులేటర్ చేసిన ప్రతిపాదనను దేశీయ టెల్కోలు వేర్వేరు కారణాలతో వ్యతిరేకించాయి.

వోడాఫోన్ ఐడియా ప్రస్తుతం ఉన్న 28 రోజులు లేదా 54 రోజులు లేదా 84 రోజుల వాలిడిటీకి ఏదైనా మార్పులు చేస్తే బిల్లింగ్ సైకిల్‌ను కలవరపెడుతుందని అలాగే వినియోగదారుల అవగాహన ఇంకా రిటైల్ ఛానెల్ ఎడ్యుకేషన్ కోసం భారీ ప్రయత్నాలు అవసరమని పేర్కొంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కూడా 30 రోజుల రీఛార్జ్‌  వాలిడిటీకి అంగీకరిస్తు "కస్టమర్ ప్రతి నెలా అదే రోజున అదే నిర్ణీత మొత్తంతో రీఛార్జ్ చేయాల్సిన టారిఫ్‌లు సాంకేతికంగా సాధ్యం కాదు" అని తెలిపాయి.

అయితే ఎయిర్‌టెల్ మాత్రం ప్రీపెయిడ్ కస్టమర్లలో ఎక్కువ శాతం తక్కువ-ఆదాయ వర్గానికి చెందినవారేనని వాదించింది. అందువల్ల 28 రోజుల రీఛార్జ్‌ను సమర్థించింది, "సమాజంలోని ఈ విభాగానికి 28 రోజుల వాలిడిటీ అంటే  వారానికోసారి వారి వినియోగాన్ని బడ్జెట్ చేస్తారు, దీంతో వారి మొబైల్ ఖర్చులను మెరుగ్గా, ఆర్గనైజేడ్ మార్గంలో నిర్వహించడంలో సహాయపడుతుంది." అని తెలిపింది.

click me!