గత కొన్నేళ్లలో ఇంటర్నెట్ వాడకం భారీగా పెరుగుతోంది. ఆన్లైన్ చదువులు, డబ్బు లావాదేవీలు, ప్రభుత్వ సేవలు, వినోదం.. ఇలా అన్నింటికీ ఇంటర్నెట్ అవసరం. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. చౌకైన మొబైల్ ఫోన్లు, డేటా ప్యాక్లు, డిజిటల్ సేవలతో ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. మొబైల్ ఇంటర్నెట్తో పాటు 5G AirFiber, Fixed Wireless Access కూడా గ్రామాల్లో ఎక్కువగా వాడుతున్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ నివేదికల ప్రకారం, దేశంలోని ఇంటర్నెట్ వినియోగదారుల్లో 53% మంది గ్రామీణ ప్రాంతాల నుంచే ఉన్నారు. 2024లో ఒక గ్రామీణ వినియోగదారుడు నెలకు 20-25 GB డేటా వాడాడు. ఇది పట్టణ వినియోగదారుల వాడకానికి దగ్గరగా ఉంది. కొన్నేళ్ల క్రితం ఇది కేవలం 3 నుంచి 5 GB మాత్రమే.
టెలికాం కనెక్షన్ల పెరుగుదలలో గ్రామీణ ప్రాంతాలు ముందున్నాయి. పట్టణాల్లో 0.06% పెరుగుదల ఉంటే, గ్రామాల్లో 0.49% పెరుగుదల నమోదైంది. పట్టణాల్లో 37 లక్షల కొత్త కనెక్షన్లు వస్తే, గ్రామాల్లో 257 లక్షల కనెక్షన్లు వచ్చాయి.
మొబైల్ డేటాతో పాటు 5G Fixed Wireless Access (FWA) అందుబాటులోకి వస్తోంది. దీన్ని AirFiber అని కూడా అంటారు. ఇళ్లు, చిన్న ఆఫీసులకు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఇవ్వడానికి దీన్ని వాడుతున్నారు.
ప్రస్తుతం దేశంలో 68 లక్షల మంది 5G AirFiber వాడుతున్నారు. ఇందులో రిలయన్స్ జియో ముందుంది. దానికి 56 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. ఇది మార్కెట్లో 82% వాటా. ఎయిర్టెల్ రెండో స్థానంలో ఉంది. దానికి 12 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు.
2025 మార్చిలో కొత్త మొబైల్ కనెక్షన్లలో జియో ముందుంది. దానికి 21.7 లక్షల కొత్త కనెక్షన్లు వచ్చాయి.
5G AirFiberలోనూ జియోదే అధిక్యం. దానికి 3.4 లక్షల కొత్త కనెక్షన్లు వచ్చాయి. ఎయిర్టెల్కు 1.6 లక్షల కనెక్షన్లు వచ్చాయి.
వైర్లైన్ బ్రాడ్బ్యాండ్లోనూ జియో ముందుంది. దానికి 1.5 లక్షల కొత్త వినియోగదారులు వచ్చారు. ఎయిర్టెల్కు 70 వేల మంది కొత్త వినియోగదారులు వచ్చారు.