మరో ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు...

Ashok Kumar   | Asianet News
Published : Jan 17, 2020, 05:35 PM IST
మరో ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు...

సారాంశం

అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ భారతదేశం అంతటా ఉన్న నగరాలు, పట్టణాలు ఇంకా గ్రామాలలో మైక్రో, చిన్న వ్యాపారాలను డిజిటలైజ్ చేయడానికి 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రతిజ్ఞ చేశారు.

న్యూ ఢిల్లీ: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా 2025 నాటికి దేశవ్యాప్తంగా అదనంగా 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.  


"2025 నాటికి ప్రపంచంలోని 10 బిలియన్ డాలర్ల భారతీయ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి అమెజాన్  గ్లోబల్ ఫూట్ ప్రింట్ ఉపయోగిస్తాము. భారతదేశంలో తమ పెట్టుబడులు 2025 నాటికి దేశవ్యాప్తంగా అదనంగా 1 మిలియన్ ఉద్యోగాలను సృష్టిస్తాయి" అని ఆయన ఒక లేఖలో పేర్కొన్నారు.

"నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ నేను భారతదేశంతో ఎక్కువ ప్రేమలో పడ్డాను. భారతీయ ప్రజల శక్తి, ఆవిష్కరణ, గ్రిట్ నాకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తాయి" అని అన్నారు.భారతదేశంలోని పలు నగరాలు, పట్టణాలు, గ్రామాలలో మైక్రో ఇంకా చిన్న వ్యాపారాలను డిజిటలైజ్ చేయడానికి బెజోస్ ఇప్పటికే 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి ప్రతిజ్ఞ చేశారు.

also read రిలయన్స్‌ జియో మరో రికార్డు... మూడున్నరేళ్లకే ‘టాప్’ రేంజి లోకి ...


బిజెపి నాయకులు, ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గం నుండి ఈ ప్రకటనలు వచ్చాయి.అమెరికా ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్‌తో గురువారం మాట్లాడుతూ అమెజాన్ కొత్తగా $ 1 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించడం ద్వారా  భారతదేశానికి పెద్దగా ప్రయోజనం పొందేదీ లేదు అని తెలిపారు.


"అమెజాన్ 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి ఉండవచ్చు, కాని వారు ప్రతి సంవత్సరం ఒక బిలియన్ డాలర్ల నష్టాన్ని కలిగిస్తే, వారు ఆ బిలియన్ డాలర్లకు ఫైనాన్స్ చేయవలసి ఉంటుంది" అని గోయల్ న్యూ ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో అన్నారు."కాబట్టి వారు ఒక బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టినప్పుడు వారు భారతదేశానికి గొప్ప సహాయం చేస్తున్నట్లు కాదు" అని ఆయన అన్నారు.


 భారతీయ జనతా పార్టీ (బిజెపి) విదేశాంగ శాఖ చీఫ్ విజయ్ చౌతైవాలే మాట్లాడుతూ, భారతదేశంలో న్యూస్ పేపర్ కవెరేజ్ చేయడంలో చాలా సమస్య ఉంది.వాషింగ్టన్ పోస్ట్ ఎడిటోరియల్ విధానం అత్యంత పక్షపాతంతో కూడుకున్నది, అది ఒక ఎజెండాతో నడిచేది" అని ఆయన ప్రత్యేక   వార్తా సంస్థతో అన్నారు.

also read టెలికం ప్రొవైడర్లకు గట్టి ఎదురుదెబ్బ...1.47 లక్షల కోట్లు చెల్లించాల్సిందే...

పౌరసత్వ సవరణ చట్టంతో సహా పిఎం మోడీ ప్రభుత్వాన్ని అమెరికాకు చెందిన వార్తాపత్రిక తరచుగా విమర్శిస్తూ అలాగే ఇటీవలి ఎడిటోరియల్ లో పౌరసత్వ సవరణ చట్టాన్ని"వివక్షత" గా పేర్కొంది.బెజోస్ తన ఇండియా పర్యటన సందర్భంగా ఒక నెల క్రితం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కావాలన్న అభ్యర్థనను ప్రధాన మంత్రి కార్యలయం తిరస్కరించింది.


తయారీ రంగంలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. నిర్మాణ రంగం ఇంకా అప్పుల  వల్ల బాధపడుతున్న కంపెనీలు తమ పెట్టుబడి ప్రణాళికలను కూడా తగ్గించాయి.నిరుద్యోగ రేటు డిసెంబరులో 7.7 శాతానికి పెరిగింది. అంతకు ముందు సంవత్సరం 7 శాతంగా ఉంది. ముంబైకి చెందిన థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ  ఈ గణాంకాలను విడుదల చేసింది.

PREV
click me!

Recommended Stories

Samsung Galaxy S25 Ultra పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ. 34,000 తగ్గిన ధర
Google Messages New Feature: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. గూగుల్ తీసుకొచ్చిన ట్యాప్ టు డ్రాఫ్ట్ ఫీచర్ ఏంటో తెలుసా?