టోక్యో ఒలింపిక్స్: ఏడాదిన్నరగా ఇంటికి దూరమయ్యా.. మీడియా సమావేశంలో పీవీ సింధు ఉద్వేగం

Siva Kodati |  
Published : Aug 04, 2021, 05:13 PM IST
టోక్యో ఒలింపిక్స్: ఏడాదిన్నరగా ఇంటికి దూరమయ్యా.. మీడియా సమావేశంలో పీవీ సింధు ఉద్వేగం

సారాంశం

ఏడాదిన్నరగా కుటుంబానికి దూరంగా వున్నానని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తెలిపారు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల ప్రోత్సాహం, త్యాగం వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని ఆమె పేర్కొన్నారు. 

టోక్యో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకం సాధించిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సైబరాబాద్ సీపీ  సజ్జనార్, అధికారులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సింధూ.. ఏడాదిన్నరగా కుటుంబానికి దూరంగా వున్నానని ఆమె తెలిపారు.

Also Read:టోక్యో ఒలింపిక్స్: హైదరాబాద్ చేరుకున్న పీవీ సింధు.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం

తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల ప్రోత్సాహం, త్యాగం వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని పీవీ సింధు పేర్కొన్నారు. అమ్మానాన్న ఇద్దరూ కూడా క్రీడాకారులు కావడం వల్ల తాను అదృష్టవంతురాలినని.. చిన్నప్పటి నుంచి నాన్న ఎన్నో సలహాలు ఇచ్చేవారని ఆమె వెల్లడించారు. వాళ్ల క్రీడా జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నారు కాబట్టే.. ఆ విషయాలు తనకు చెప్పి ఇక్కడి వరకు తీసుకొచ్చారని సింధు అన్నారు. ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది క్రీడాకారులకు చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. త్వరలో పారిస్‌లో జరగబోయే టోర్నీలో పాల్గొంటానని సింధు వెల్లడించారు. 
 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !