టోక్యో ఒలింపిక్స్: భారత బాక్సర్ మేరీకోమ్ శుభారంభం... తొలి రౌండ్‌లో...

Published : Jul 25, 2021, 01:51 PM IST
టోక్యో ఒలింపిక్స్: భారత బాక్సర్ మేరీకోమ్ శుభారంభం... తొలి రౌండ్‌లో...

సారాంశం

తొలి రౌండ్‌లో డొమినిక్ రిప్లబిక్ బాక్సర్ మిగులినా హర్నాండేజ్ గ్రేసియాను 4-1 తేడాతో ఓడించిన మేరీకోమ్... 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన మేరీకోమ్...

భారత సీనియర్ బాక్సర్ మేరీకోమ్‌, టోక్యో ఒలింపిక్స్‌లో శుభారంభం దక్కించుకుంది. 51 కేజీల విభాగంలో జరిగిన తొలి రౌండ్‌లో డొమినిక్ రిప్లబిక్ బాక్సర్ మిగులినా హర్నాండేజ్ గ్రేసియాను 4-1 తేడాతో ఓడించిన మేరీకోమ్, రౌండ్ 16లోకి అడుగుపెట్టింది.

2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన మేరీకోమ్, ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్‌షిప్ గెలిచింది. ఈ సారి స్వర్ణ పతకం సాధించాలనే లక్ష్యంతో టోక్యో ఒలింపిక్స్‌ బరిలో దిగుతోంది. 

అంతకుముందు టేబుల్ టెన్నిస్‌లోనూ భారత ప్లేయర్ మానికా బత్రా విజయం సాధించింది. తొలి రెండు సెట్లు కోల్పోయిన తర్వాత అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చిన మానికా బత్రా... 20వ సీడెడ్ అయిన ఉక్రెయిన్ ప్లేయర్ మార్గేట్టా పెసోస్కాను 4-3 తేడాతో ఓడించి మూడో రౌండ్‌కి దూసుకెళ్లింది. 

 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !