టోక్యో ఒలింపిక్స్: టేబుల్ టెన్నిస్‌లో పోరాడి ఓడిన జ్ఞానశేఖరన్...

By Chinthakindhi RamuFirst Published Jul 25, 2021, 11:58 AM IST
Highlights

 ఏడు సెట్ల వరకూ సాగిన మ్యాచ్‌లో హంగ్ కాంగ్ ప్లేయర్ లామ్ సి హంగ్‌ చేతుల్లో 4-3 తేడాతో ఓడిన సాథియన్ జ్ఞానశేఖరన్...

వరుసగా మూడు సెట్లలో గెలిచిన తర్వాత వరుసగా మూడు సెట్లలో ఓడి మ్యాచ్‌ను కోల్పోయిన భారత టీటీ ప్లేయర్...

టోక్యో ఒలింపిక్స్ 2020లో మూడో రోజు భారత జట్టుకి పెద్దగా కలిసి రావడం లేనట్టే ఉంది. టేబుల్ టెన్నిస్ మెన్స్ సింగిల్స్‌లో సాథియన్ జ్ఞానశేఖరన్, హంగ్‌కాంగ్‌కి చెందిన లామ్ సి హంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఓడాడు.

గంటకు పైగా సాగిన ఈ సుదీర్ఘ మ్యాచ్‌లో 11-7, 7-11, 4-11, 5-11, 11-9, 12-10, 11-6 తేడాతో ఏడు సెట్ల వరకూ సాగిన మ్యాచ్‌లో జ్ఞానశేఖరన్, లామ్ సి హంగ్‌ చేతుల్లో 4-3 తేడాతో ఓడాడు. 

తొలి గేమ్‌ను కోల్పోయినా, ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచి 3-1 తేడాతో తిరుగులేని ఆధిక్యం సంపాదించిన భారత టీటీ ప్లేయర్ జ్ఞానశేఖరన్, ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు కోల్పోయి మ్యాచ్‌ను కోల్పోవడం విశేషం. 

నిన్న జరిగిన టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో భారత టీటీ ప్లేయర్లు మానికా బత్రా, సుత్రీతా ముఖర్జీ విజయాలు అందుకుని, రెండో రౌండ్‌కి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. రెండో రౌండ్‌లో మానికా, ఉక్రెయిన్‌కి చెందిన మార్గెట్టా పెసోకాతో తలబడనుంది.

click me!