టోక్యో ఒలింపిక్స్: టీటీ ప్లేయర్ మానికా బత్రా సంచలనం... రెండో రౌండ్‌లో గెలిచి...

By Chinthakindhi RamuFirst Published Jul 25, 2021, 1:34 PM IST
Highlights

తనకి ఎంతో మెరుగైన ర్యాంకులో ఉన్న ఉక్రెయిన్‌కి చెందిన మార్గేట్టా పెసోస్కా ఓడించి మూడో రౌండ్‌కి....

2-0 తేడాతో వెనకబడిన తర్వాత అద్భుతంగా కమ్‌బ్యాక్ ఇచ్చిన మానికా బత్రా...

టోక్యో ఒలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మానికా బత్రా సంచలనం సృష్టించింది. వుమెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో తనకి ఎంతో మెరుగైన ర్యాంకులో ఉన్న ఉక్రెయిన్‌కి చెందిన మార్గేట్టా పెసోస్కాను 4-11, 4-11, 11-7, 12-10, 8-11, 11-5, 11-7 తేడాతో ఓడించి, మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది.

మొదటి రెండు సెట్లు కోల్పోయి 2-0 తేడాతో వెనకబడిన మానికా బత్రా... ఆ తర్వాత వరుస రెండు సెట్లు గెలిచి 2-2 తేడాతో స్కోర్లు సమం చేసింది. ఆ తర్వాత ఐదో సెట్‌ను మార్గేట్టా సొంతం చేసుకోగా, కీలకమైన ఆరో సెట్‌లో అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చిన మానికా, ఆ తర్వాతి సెట్‌ను కూడా సొంతం చేసుకుని 4-3 తేడాతో మ్యాచ్‌లో విజయం సాధించింది. 

టేబుల్ టెన్నిస్ మెన్స్ సింగిల్స్‌లో సాథియన్ జ్ఞానశేఖరన్, హంగ్‌కాంగ్‌కి చెందిన లామ్ సి హంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఓడాడు. టీటీ మహిళల సింగిల్స్‌లో రెండో రౌండ్‌కి అర్హత సాధించిన మరో భారత ప్లేయర్ సుత్రీత ముఖర్జీ మ్యాచ్ ఆడనుంది.

click me!