టోక్యో ఒలింపిక్స్: క్వార్టర్ ఫైనల్స్‌కి భారత మహిళా హాకీ జట్టు... ఐర్లాండ్ ఓటమితో...

By Chinthakindhi RamuFirst Published Jul 31, 2021, 6:47 PM IST
Highlights

గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో 0-2 తేడాతో ఓడిన ఐర్లాండ్...

గ్రూప్‌లో రెండు విజయాలతో నాలుగో స్థానంలో నిలిచి, క్వార్టర్ ఫైనల్స్‌కి చేరిన టీమిండియా...

టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళా హాకీ జట్టు, క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. గ్రూప్ లీగ్‌లో రెండు విజయాలు సాధించిన టీమిండియా, నాలుగో స్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్‌కి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఐర్లాండ్ ఓడిపోవడం, భారత జట్టుకి కలిసి వచ్చింది.

గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ 0-2 తేడాతో ఓడిపోయింది. ఈ పరాజయంతో ఐర్లాండ్ ఐదు, సౌతాఫ్రికా ఆరో స్థానంలో నిలిచి గ్రూప్ దశ నుంచే నిష్కమించాయి. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో అత్యుత్తమంగా 4వ స్థానంలో నిలిచిన టీమిండియా, ఆ తర్వాత 36 ఏళ్లకు 2016 రియో ఒలింపిక్స్‌కి అర్హత సాధించగలిగింది.

రియోలో ఐదు మ్యాచుల్లో ఒకే ఒక్క డ్రా చేసుకొని, నాలుగు మ్యాచుల్లో ఓడిన భారత మహిళా జట్టు... టోక్యోలో రెండు వరుస విజయాలతో క్వార్టర్ ఫైనల్‌కి ప్రవేశించడం విశేషం... 

click me!