ఒలింపిక్స్లో భాగంగా బ్యాడ్మింటన్ క్వార్టర్స్ ఫస్ట్ గేమ్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు విజయం సాధించారు. జపాన్ క్రీడాకారిణీ యమగుచితో తలపడుతున్న సింధు తొలి గేమ్ను 21-13 తేడాతో గెలిచింది
ఒలింపిక్స్లో భాగంగా బ్యాడ్మింటన్ క్వార్టర్స్ ఫస్ట్ గేమ్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు విజయం సాధించారు. జపాన్ క్రీడాకారిణీ యమగుచితో తలపడుతున్న సింధు తొలి గేమ్ను 21-13 తేడాతో గెలిచింది. మ్యాచ్ ఆరంభంలో కాస్త తడబడిన సింధు తర్వాత బలంగా పుంజుకుంది. తొలి బ్రేక్లో 11-7తో ఆధిపత్యం ప్రదర్శించింది. విరామం తర్వాత యమగుచి కాస్త దూకుడు ప్రదర్శించినా.. సింధు మ్యాచ్పై పట్టు కోల్పోలేదు.