కోహ్లీ, విరాట్ కోహ్లీ స్టైలిష్ ఫోటో.. తీసింది ఎవరో తెలుసా..?

By telugu news teamFirst Published Jul 30, 2021, 1:37 PM IST
Highlights

తాజాగా  ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న వీరు.. అక్కడి అందాలను ఆస్వాదిస్తున్నారు. సరదాగా గడుపుతున్న ఫోటోలను తాజాగా కేఎల్ రాహుల్ షేర్ చేశాడు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టైలిష్ బ్యాట్స్ మెన్ కేల్ రాహుల్.. వీరిద్దరూ మంచి స్నేహితులు. అంతేనా.. వీరిద్దరూ ఫోటో షూట్లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు తమ స్టైలిష్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా.. కూడా వీరిద్దరూ కూడా మరికొందరితో కలిసి ఫోటో  షూట్ చేశారు. అయితే.. ఆ ఫోటోలను తీసింది ఎవరో తెలుసా..? బాలీవుడ్ బ్యూటీలు అనుష్క శర్మ, అతియా శెట్టి కావడం గమనార్హం.

కోహ్లీ.. అనుష్కను ప్రేమించి పెళ్లాడగా.. కేఎల్ రాహుల్ అతియాలు పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. తాజాగా  ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న వీరు.. అక్కడి అందాలను ఆస్వాదిస్తున్నారు. సరదాగా గడుపుతున్న ఫోటోలను తాజాగా కేఎల్ రాహుల్ షేర్ చేశాడు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KL Rahul👑 (@rahulkl)

ఫస్ట్ ఫోటోలో.. కోహ్లీ, కేఎల్ రాహుల్. మరో ముగ్గురు ఫోటోకి సూపర్ స్టైలిష్ గా ఫోజు ఇచ్చిన ఫోటో షేర్ చేసి.. రెండో ఫోటోలో.. ఆ ఫోటో తీయడానికి అనుష్క, అతియా ఎంత కష్టపడుతున్నారో షేర్ చేశాడు. ఈ ఫోటోలో  ఉమేష్ యాదవ్ బార్య తాన్య, ఇషాంత్ శర్మ భార్య ప్రతిమా సింగ్ కూడా ఉన్నారు. అందుకే వీరిని కూడా రాహుల్ షేర్ చేశాడు. మయాంక్ అగర్వాల్ భార్య ఆషితాను కూడా ట్యాగ్ చేయడం గమనార్హం.

click me!