ఆసియా కప్: భారత్-పాక్ మ్యాచ్‌కు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్..?

By Arun Kumar PFirst Published Sep 19, 2018, 12:58 PM IST
Highlights

చాలా సంవత్సరాలు తర్వాత భారత్-పాక్ మధ్య వన్డే జరుగుతుండటంతో క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా భారత్, పాక్ అభిమానులు టీవీల ముందు రెడీ అయిపోయారు.

చాలా సంవత్సరాలు తర్వాత భారత్-పాక్ మధ్య వన్డే జరుగుతుండటంతో క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా భారత్, పాక్ అభిమానులు టీవీల ముందు రెడీ అయిపోయారు. నరాల తెగే ఉత్కంఠ మధ్య సాగే మ్యాచ్‌ను మిస్సవ్వకూడదని చాలామంది దుబాయ్ కూడా వెళ్లారు.

కాగా.. ఇవాళ జరిగే ఈ మ్యాచ్‌ను తిలకించడానికి విశిష్ట అతిథి రాబోతున్నారు.. ఆయన ఎవరో కాదు.. పాకిస్తాన్ ప్రధాన మంత్రి, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్. రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లిన ఇమ్రాన్.. దుబాయ్‌లో జరిగే భారత్-పాక్ మ్యాచ్‌కు హాజరవుతారని పాక్ విదేశాంగ శాఖ వర్గాలు అంటున్నాయి.

click me!
Last Updated Sep 19, 2018, 12:58 PM IST
click me!