న్యూ ఢిల్లీ: భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత సైన్యానికి నీరజ్ చోప్రా తన మద్దతును ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరాడుతున్న సైన్యం ధైర్యసాహసాలను, కృషిని ఆయన ప్రశంసించారు.రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా, తన అధికారిక X హ్యాండిల్ ద్వారా సైన్యానికి సంఘీభావం ప్రకటించారు. ఈ సున్నిత సమయంలో ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
"ఉగ్రవాదంపై పోరాడుతున్న మన ధైర్యవంతులైన భారత సైన్యం గురించి మనం గర్వపడుతున్నాం. ఈ సమయంలో అందరి భద్రతను నిర్ధారించడానికి మార్గదర్శకాలను పాటించాలి. జై హింద్ జై భారత్ జై హింద్ కీ సేన" అని చోప్రా రాసుకొచ్చారు.
. </p>