ఒకే ఒలంపిక్స్ లో రెండు పతకాలు.. అవనీ లేఖరా అరుదైన ఘనత

By telugu news teamFirst Published Sep 3, 2021, 11:46 AM IST
Highlights

షూటింగ్ కేటగిరిలో అవనీ లేఖరా ఈ పతకాన్ని సాధించింది. అయితే.. స్వర్ణంతో పాటు.. తాజాగా.. మరో అరుదైన ఘనతను కూడా అవనీ సాధించింది.

టోక్యో పారా ఒలంపిక్స్ లో.. భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. పతకాల జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ పారా ఒలంపిక్స్ లో.. తొలిసారిగా భారత్ కి స్వర్ణం దక్కిన సంగతి తెలిసిందే. షూటింగ్ కేటగిరిలో అవనీ లేఖరా ఈ పతకాన్ని సాధించింది. అయితే.. స్వర్ణంతో పాటు.. తాజాగా.. మరో అరుదైన ఘనతను కూడా అవనీ సాధించింది.

భారత మహిళా షూటర్‌ అవనీ లేఖరా మరో పతకాన్ని కైవసం చేసుకున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ స్టాడింగ్‌ (ఎస్‌హెచ్‌1) విభాగంలో స్వర్ణ పతాకం అందించిన తొలి భారతీయ మహిళగా నిలిచిన అవనీ శుక్రవారం జరిగిన 50 మీటర్ల రైఫిల్‌ షూటింగ్‌ విభాగంలో కాంస్య పతకాన్ని సొంత చేసుకున్నారు. ఇలా ఒకే ఒలంపిక్స్ లో.. రెండు పతకాలను సాధించి.. అరుదైన ఘనతను అవనీ సాధించారు. దీంతో.. ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

click me!